DNB News - ఆంధ్రప్రదేశ్ / : విజయవాడలో కర్నూలు జిల్లా జోనల్–5 కోఆర్డినేటర్, ఎమ్మెల్సీ బీద రవిచంద్ర ను కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలు గుడిసె ఆది కృష్ణమ్మ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కర్నూలు జిల్లాలో తెలుగుదేశం పార్టీని మరింత బలోపేతం చేయడం, గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు పార్టీ శ్రేణులను సంఘటితం చేయడం, కార్యకర్తల్లో ఉత్సాహం నింపడం వంటి కీలక అంశాలపై సవివరంగా చర్చించారు. రాబోయే రోజుల్లో జిల్లాలో పార్టీ కార్యక్రమాలను వేగవంతం చేయడం, ప్రజా సమస్యలపై బలంగా పోరాడడం, పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం కోసం సమన్వయంతో పనిచేయాలని నిర్ణయించారు. కర్నూలు జిల్లాలో పార్టీని మరింత శక్తివంతంగా తీర్చిదిద్దేందుకు కలిసి కట్టుగా పనిచేయాలని సంకల్పించారు.
Admin
DNB News