DNB News - ఆంధ్రప్రదేశ్ / : జిల్లా పోలీసు కార్యాలయంలో 77వ భారత గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి , కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఐపియస్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం జిల్లా కలెక్టర్ , కర్నూలు ఎస్పీ తో కలిసి పెరేడ్ను వీక్షించి, సాయుధ దళాల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లాలో ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలపై జిల్లా కలెక్టర్ సందేశాన్ని చదివి వినిపించారు. స్వాతంత్ర్య సమరయోధుల కుటుంబ సభ్యులను సన్మానించి, విధుల్లో ఉత్తమ సేవలందించిన అధికారులకు ప్రశంసా పత్రాలు అందజేసి అభినందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి, జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్, డిసిఎంఎస్ చైర్మన్ నాగేశ్వర యాదవ్, సదరన్ రీజియన్ హోంగార్డు కమాండెంట్ మహేష్ కుమార్, అడిషనల్ ఎస్పీలు హుస్సేన్ పీరా, కృష్ణమోహన్, డీఎస్పీలు, సీఐలు, ఎస్సైలు, వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Admin
DNB News