DNB News - ఆంధ్రప్రదేశ్ / : ఆదోని జిల్లా సాధన కోసం కొనసాగుతున్న రిలే నిరాహార దీక్షలు 150వ రోజుకు చేరుకుంటున్న నేపథ్యంలో, ఏప్రిల్ 14న నిర్వహించనున్న మహాసభను విజయవంతం చేయాలని జాయింట్ యాక్షన్ కమిటీ (జేఏసీ) నాయకులు పగడాల కోదండ, వైపి నాగరాజు, బండారి హనుమంతు, సుజ్ఞానమ్మ పిలుపునిచ్చారు. ఆదోని జిల్లా సాధన జేఏసీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న రిలే నిరాహార దీక్షలు ప్రస్తుతం 147వ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా దీక్షలో పాల్గొన్న రామకృష్ణ, గాజుల రామాంజనేయులు, సుభాష్ చంద్రబోస్, పి. కుమార్ (ఐఎఫ్టియు)లకు జేఏసీ నాయకులు వైపి నాగరాజు, బండారి హనుమంతు, సుజ్ఞానమ్మ దీక్షను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఏప్రిల్ 14న 150వ రోజు సందర్భంగా సర్వమత సామూహిక నిరాహార దీక్షతో పాటు భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఆదోని పట్టణంతో పాటు ఐదు నియోజకవర్గాల ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ మహాసభను విజయవంతం చేయాలని కోరారు. ఇదే సందర్భంగా మహాత్మ జ్యోతిరావు పూలే 199వ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ జైన్, మాజీ మార్కెట్ చైర్మన్ దేవిశెట్టి ప్రకాష్, క్రిస్టియన్ యూనియన్ అధ్యక్షులు రెవ. జి. ఆనంద్ రాజు తదితరులు పాల్గొని పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. వారు మాట్లాడుతూ, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన మహాత్మ జ్యోతిరావు పూలే ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని ఆదోని జిల్లా సాధన కోసం ప్రతి ఒక్కరూ ఉద్యమంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. అన్ని కులాలు, మతాలు, వర్గాలకు చెందిన ప్రజలు ఐక్యంగా పోరాడితేనే ఆదోని జిల్లా సాధ్యం అవుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు దాసరి గోవిందు, గుమ్మల బాలస్వామి, దాసరి నరేష్, ఎస్. బాలన్న, పిఎస్. వీరేష్, మాదాసు జగన్, బండారి గిడ్డయ్య, హెబ్బటం రాజు, జిఎస్ దత్తు, ఎం. శాంతరాజు, వీరాంజి, మఠం వీరభద్రప్ప, గంగపుత్ర సంఘం నాయకులు బెస్త ప్రకాష్, బెస్త దీపక్, గోల్డ్ శీను, సాంబగల్ బాలరాజు తదితరులు పాల్గొన్నారు.
Admin
DNB News