DNB News - ఆంధ్రప్రదేశ్ / : రెండవ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. శిల్ప అపార్ట్మెంట్ ఎదురుగా ఉన్న అరుగుపై సుమారు 62 సంవత్సరాల వయసు గల గుర్తుతెలియని వృద్ధుడు గత సోమవారం రాత్రి మృతి చెందాడు. స్థానికుల సమాచారం ప్రకారం, ఆ వృద్ధుడు గత మూడు రోజులుగా అదే అరుగుపై నివసిస్తూ నిస్సహాయ స్థితిలో ఉన్నాడు. పరిసర ప్రాంత ప్రజలు మానవత్వంతో ఆహారం, మజ్జిగ, నీరు అందించినప్పటికీ, అతను వాటిని సేవించలేని పరిస్థితిలో ఉన్నట్లు తెలిపారు. తీవ్ర ఎండలో కూడా అదే ప్రదేశంలో ఉండడం గమనార్హం. అనారోగ్యం, వృద్ధాప్యం లేదా వడదెబ్బ కారణంగా మృతి జరిగి ఉండవచ్చని స్థానికులు భావిస్తున్నారు. సమాచారం అందుకున్న వెంటనే రెండో పట్టణ సీఐ రాజశేఖర్ రెడ్డి ఆదేశాల మేరకు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతుడి వివరాలు సేకరిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. గుర్తుతెలియని ఈ వృద్ధుడి గురించి ఎవరైనా సమాచారం తెలిసిన వారు సమీప పోలీస్ స్టేషన్ను సంప్రదించవలసిందిగా పోలీసులు కోరుతున్నారు.
Admin
DNB News