Saturday, 18 April 2026 02:06:56 PM
# రైతులు ధాన్యంలో తాలు లేకుండా కొనుగోలు కేంద్రానికి తీసుకుని రావాలి... జిల్లావ్యవసాయ అధికారి శ్రీధర్ రెడ్డి # బీసీవై పార్టీ ధర్మ దీక్షలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ పై అనుచిత వ్యాఖ్యలు # ఆరోగ్య సూత్రాలు పాటించండి శ్రమదానం చేయండి ఆరోగ్యంగా ఉండండి # ఓ పెళ్లి వేడుకలో కేటరింగ్ గుత్తేదారు దుశ్చర్యతో విషాద వాతావరణం అలముకొంది. # ఇల్లందు ప్రభుత్వ వైద్యశాల ను ఈరోజు కాయకల్ప ఎక్స్టర్నల్ అసెస్మెంట్ టీం డాక్టర్ రఘు పూజారి, డాక్టర్ జోత్స్న మరియు వారి బృందం సందర్శించారు # ఉపాధిహామీకూలీలకు రోజు 600 రూపాయల చెల్లించాలి వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు కామ్రేడ్ ములకలపల్లి రాములు డిమాండ్ # జీఎస్టీ అమలు సమన్వయంపై కలెక్టరేట్‌లో సమీక్ష సమావేశం # రాయలసీమ సాగునీటి హక్కుల కోసం వైఎస్ఆర్సీపీ సమాలోచన సమావేశం # కేంద్ర మంత్రి బండి సంజయ్ ని కలిసిన ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం # విద్యార్థుల ప్రాణాలతో ఆటలాడుతున్న స్కూల్ యాజమాన్యం – ఇంకా చర్యలు ఎందుకు లేవు?”.. # అల్ఫోర్స్ ఇ-టెక్నో స్కూల్ లో డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ వర్ధంతి # ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఉద్యోగ భద్రత కల్పించాలి. # టి డి పి రాష్ట్ర అధ్యక్షులుగా రెండవసారి నియమితులైన పల్లా శ్రీనివాసరావు సన్మానించి, శుభాకాంక్షలు తెలిపిన బొండా యల్లాజీరావు, శ్రీదేవి లు # శాతవాహన అభివృద్ధికి కృషి - నూతన కార్యనిర్వాహక మండలి సభ్యులు # కాంగ్రెస్ సీనియర్ మైనార్టీ మహిళా నాయకురాలు సమాన మహమ్మద్ # గోడౌన్ నిర్మాణానికి స్థలాన్ని పరిశీలించిన రాష్ట్ర గిడ్డంగుల సంస్ధ చైర్మన్ రాయల నాగేశ్వరరావు.. # ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రి లో ఫ్రీజర్ పని చేయక పోవడం తో చనిపోయిన వారు పరిస్థితి దారుణం # తిరుమలాయపాలెం మండలం పిండిప్రోలు లో ఓ ఇంట్లో చోరీ # బిజెపి మండల ప్రధాన కార్యదర్శిగా భాషబోయిన ప్రదీప్ యాదవ్ నియామకం # ఘనంగా కిసాన్ నగర్ హిందూ సమ్మేళనం

శ్రీసిటీలో ‘ఆధ్యాత్మికతతో కర్తవ్య నిర్వహణ’ అంశంపై స్ఫూర్తిదాయక ప్రసంగం

Date : 21 January 2026 05:01 PM Views : 84

DNB News - ఆంధ్రప్రదేశ్ / : శ్రీసిటీ ఆధ్యాత్మిక సాహిత్య వేదిక శ్రీవాణి, హైదరాబాద్‌కు చెందిన విజ్డమ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ‘ఆధ్యాత్మికతతో కర్తవ్య నిర్వహణ' అనే అంశంపై బుధవారం ఉదయం శ్రీసిటీలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ తత్వవేత్త వినయ్ జీ స్ఫూర్తిదాయక ప్రసంగం చేయగా, పలువురు పరిశ్రమల ఉద్యోగులు, విద్యావేత్తలు, స్థానిక ప్రజలు పాల్గొని ఆధునిక జీవనంలో ఆధ్యాత్మికత ఆవశ్యకతపై తగు అవగాహన పొందారు.స్థానిక బీరోలెక్స్ పరిశ్రమ మేనేజింగ్ డైరెక్టర్ వై.శ్రీనివాస్ రెడ్డి అతిథిని పరిచయం చేసి, వినయ్ జీ బోధనలపై తన వ్యక్తిగత అనుభవాలను పంచుకున్నారు.వినయ్ జీ తన ప్రసంగంలో భగవద్గీత ఆధారంగా ఆధునిక ఉద్యోగ జీవనంలో ఆధ్యాత్మికత ప్రాముఖ్యతను వివరించారు. ఫలితాలను ఆశించకుండా కర్తవ్య నిర్వహణ చేయడం, జయాపజయాల పట్ల నిశ్చల భావన కలిగి ఉండటం ద్వారా పని మరింత అర్థవంతంగా మారుతుందని తెలిపారు. కర్మయోగం ద్వారా నైతిక నాయకత్వం, ఆత్మ నియంత్రణ, మానసిక స్థైర్యం సాధ్యమవుతాయని వివరించారు. రాజస, తమస, సాత్విక గుణాలపై విశ్లేషన, సోదాహరణ ప్రసంగంతో ఆకట్టుకున్నారు. ఆత్మ నియంత్రణ ప్రాముఖ్యతను ప్రస్తావిస్తూ, నిరర్ధక విషయాలపై దృష్టి పెట్టకుండా, జాగరూకతతో ఉద్దేశ్యపూర్వకమైన కార్యాచరణను ఆచరించమని సభికులను ప్రేరేపించారు. చివరగా కర్తవ్య నిర్వహణలో ఆధ్యాత్మికత అనేది పూర్తిగా జ్ఞాన ఆధారిత చర్య అని ఆయన నిర్థారించారు.తమ ఆహ్వానం మేరకు శ్రీసిటీ విచ్చేసి విలువైన ప్రసంగం చేసిన వినయ్ జీకి శ్రీసిటీ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ రవీంద్ర సన్నారెడ్డి తన సందేశంలో కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమం పరిశ్రమల వర్గాలకు ఎంతో ఉపయోగకరంగా నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు.ప్రశ్నోత్తరాల సమయంలో పలువురు ఉత్సాహంగా పాల్గొని, వ్యాపార నిర్వహణ, వ్యక్తిగత అభివృద్ధిలో ఆధ్యాత్మికతను ఎలా అమలు చేయాలన్న అంశాలపై తమ సందేహాలను నివృత్తి చేసుకున్నారు. ఈ కార్యక్రమం వ్యక్తిగత శ్రేయస్సు, సంస్థల పనితీరు మెరుగుదలకు దోహదపడుతుందని వారు అభిప్రాయపడ్డారు.విజ్డమ్ ఫౌండేషన్ 2017లో వినయ్ జీ స్థాపించిన ఒక ధార్మిక సంస్థ. ఇది సనాతన ధర్మంలోని మూల సూత్రాలను ప్రజలకు పరిచయం చేసి, వాటిని ఆచరణలోకి తీసుకురావడం లక్ష్యంగా పనిచేస్తుంది. ఈ సంస్థ ఉపన్యాసాలు, అధ్యయన తరగతులు, వర్క్‌షాప్‌లు, కార్పొరేట్ సెమినార్లు ద్వారా ఒత్తిడి నిర్వహణ, స్వీయ అభివృద్ధి మరియు అర్థవంతమైన జీవన విధానానికి దోహదపడే ఆధ్యాత్మిక అంశాలను వివరిస్తాయి.

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :