DNB News - ఆంధ్రప్రదేశ్ / : కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్ దేశ భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని రూపొందించిన సమగ్ర బడ్జెట్గా ఎమ్మెల్యే కూన రవికుమార్ పేర్కొన్నారు. దేశాభివృద్ధికి కీలకమైన మౌళిక సదుపాయాలు, విద్య, వైద్య, ఆరోగ్యం, వ్యవసాయం, రక్షణ రంగాలకు ఈ బడ్జెట్లో పెద్దపీట వేయడం అభినందనీయమని తెలిపారు. ✅దేశ ఆర్థిక వ్యవస్థను మరింత బలోపేతం చేసి, ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక శక్తిగా భారత్ను నిలబెట్టే దిశగా ఈ బడ్జెట్ కీలక పాత్ర పోషిస్తుందన్నారు. ముఖ్యంగా ఉత్పత్తి రంగాన్ని ప్రోత్సహించడంలో, MSME రంగాన్ని బలోపేతం చేయడంలో కేంద్ర బడ్జెట్ స్పష్టమైన దృష్టిని చూపిందని పేర్కొన్నారు. చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు రుణ సౌలభ్యం, ఉపాధి అవకాశాల పెంపు ద్వారా యువతకు భవిష్యత్ భరోసా కల్పించేలా బడ్జెట్ ఉందన్నారు. ✅వ్యవసాయ రంగానికి సంబంధించి రైతుల ఆదాయం పెంచే లక్ష్యంతో తీసుకున్న చర్యలు, ఆధునిక వ్యవసాయ పద్ధతులు, సాగునీటి ప్రాజెక్టులకు నిధుల కేటాయింపులు రైతులకు మేలు చేస్తాయని చెప్పారు. అలాగే వైద్య, ఆరోగ్య రంగాల్లో మౌలిక వసతుల విస్తరణ, నాణ్యమైన వైద్య సేవలు అందుబాటులోకి తీసుకువచ్చేలా బడ్జెట్ రూపకల్పన చేయడం ప్రశంసనీయమన్నారు. ✅హెరిటేజ్ టూరిజం విస్తరణకు బడ్జెట్లో ఇచ్చిన ప్రాధాన్యం దేశ సంస్కృతి, సంప్రదాయాలను ప్రపంచానికి పరిచయం చేసే అవకాశంగా మారుతుందని అన్నారు. చారిత్రక కట్టడాలు, దేవాలయాలు, వారసత్వ ప్రాంతాల అభివృద్ధి ద్వారా పర్యాటకం పెరిగి, స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయని స్పష్టం చేశారు. ✅ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి *రూ.64,362 కోట్ల నిధుల కేటాయింపు* రాష్ట్ర అభివృద్ధికి ఎంతో దోహదపడుతుందని తెలిపారు. ఈ నిధులతో మౌలిక వసతులు, పరిశ్రమలు, ఉపాధి అవకాశాలు పెరుగుతాయని, రాష్ట్ర ఆర్థిక ప్రగతికి ఇది మైలురాయిగా నిలుస్తుందన్నారు. ✅దేశం, రాష్ట్రం రెండింటి సమగ్ర అభివృద్ధిని లక్ష్యంగా చేసుకుని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్కు ఎమ్మెల్యే కూన రవికుమార్ హర్షం వ్యక్తం చేస్తూ, ప్రధాని నరేంద్ర మోదీకి, కేంద్ర ఆర్థిక మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు.
Admin
DNB News