DNB News - ఆంధ్రప్రదేశ్ / : గత వైసీపీ ప్రభుత్వంలో కేవలం పార్టీ పేరు చెప్పి కక్ష కట్టి పనులు పూర్తి చేసినప్పటికీ నిధులు విడుదల చేయకుండా జాప్యం చేయడం వలన ఎన్నో వేలమంది రాష్ట్రవ్యాప్తంగా నష్టపోయారు ఈ అంశంపై ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి అహర్నిశలు శ్రమించి నిధులు ఈరోజు విడుదల కావడంలో విశేష కృషి చేశారు శాసనసభ్యులు కూన రవికుమార్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజ్ (SDP) శ్రీకాకుళం జిల్లాలోని ఆముదాలవలస నియోజకవర్గం కు రూ.41,35,763/- నిధులను విడుదల చేస్తూ పరిపాలనా అనుమతులు మంజూరు చేసింది. ఈ మేరకు ప్లానింగ్ (V) డిపార్ట్మెంట్ నుంచి G.O.Rt.No.20 ద్వారా ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ నిధులు 2014–19 కాలంలో SDP కింద మంజూరైన అభివృద్ధి పనులకు సంబంధించిన పెండింగ్ బిల్లుల చెల్లింపుల కోసం విడుదల చేసినట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. SDP మరియు MGNREGS నిధుల సమ్మేళనంతో చేపట్టిన పనులకు సంబంధించి పెండింగ్ బిల్లుల చెల్లింపుల కోసం శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస నియోజకవర్గంలో SDP కింద చేపట్టిన పనుల పెండింగ్ బిల్లుల క్లియరెన్స్ కోసం రూ.41,35,763/- నిధులు మంజూరు చేశారు. ఈ మేరకు శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ పనుల వివరాలు, ప్రస్తుత స్థితిగతులతో కూడిన ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపగా, వాటిని పరిశీలించిన అనంతరం ప్రభుత్వం నిధుల విడుదలకు ఆమోదం తెలిపింది. ఇప్పటికే ఆర్థిక శాఖ (FMU-GAD-2) ద్వారా 2025–26 బడ్జెట్ అంచనాల కింద నిధుల విడుదలకు ఉత్తర్వులు జారీ కావడంతో, వాటి ఆధారంగా ఇప్పుడు పరిపాలనా అనుమతులు మంజూరయ్యాయి. ఈ నిధుల విడుదలతో పెండింగ్ బిల్లులు చెల్లింపులు పూర్తై, గతంలో చేపట్టిన అభివృద్ధి పనులకు ఆర్థిక ఊరట కలగనుంది అని ఎమ్మెల్యే చెప్పారు
Admin
DNB News