DNB News - ఆంధ్రప్రదేశ్ / : ఈ రోజు సచివాలయంలో మైనింగ్ భూగర్భ శాస్త్ర & ఎక్సైజ్ శాఖ మంత్రివర్యులు కొల్లు రవీంద్ర ను కార్యాలయంలో కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలు గుడిసె ఆది కృష్ణమ్మ , ఆలూరు నియోజకవర్గం ఇంచార్జి వైకుంఠం జ్యోతి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జిల్లాలో మైనింగ్ కార్యకలాపాల వల్ల ప్రభావితమవుతున్న గ్రామాల సమస్యలను మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. ముఖ్యంగా రహదారుల దెబ్బతినడం, భూగర్భ జలాల తగ్గుదల, పర్యావరణ సమస్యలు, స్థానికులకు ఉపాధి అవకాశాల కల్పన వంటి అంశాలపై సమగ్రంగా చర్చించారు. అదేవిధంగా ఎక్సైజ్ శాఖకు సంబంధించిన పలు సమస్యలను కూడా వివరించి, తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. మైనింగ్ ప్రభావిత ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతం చేయాలని, ప్రజలకు న్యాయం జరిగేలా చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. మంత్రి కొల్లు రవీంద్ర వారి వినతిని సానుకూలంగా పరిశీలించి, సంబంధిత అధికారులతో చర్చించి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు తెలిపారు.
Admin
DNB News