DNB News - ఆంధ్రప్రదేశ్ / : తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మాజీ స్పీకర్,వైసీపీ రాజకీయ వ్యవహారల కమిటీ సభ్యులు తమ్మినేని సీతారాం, ఆయన తనయుడు యువనేత తమ్మినేని చిరంజీవినాగ్ మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు.ఈ భేటీలో ప్రధానంగా రాష్ట్ర రాజకీయాలతో పాటు శ్రీకాకుళం జిల్లా,ముఖ్యంగా ఆముదాలవలస నియోజకవర్గంలోని తాజా రాజకీయ పరిస్థితులపై ఇరువురు నేతలు సుదీర్ఘంగా చర్చించారు. జిల్లా లో ప్రతి నియోజకవర్గంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులను తమ్మినేని కూలంకశంగా వివరించారు. అదేవిదంగా కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన నాటి నుండి రాష్ట్రంలో నెలకొన్న విధ్వంసకర పరిస్థితులపై తమ్మినేని సీతారాం తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.తన నాలుగున్నర దశాబ్దాల సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో ఎన్నడూ చూడని భయానక వాతావరణం ప్రస్తుతం రాష్ట్రంలో ఉందన్న ఆయన,ప్రభుత్వం కేవలం ప్రతిపక్ష నేతలపై కక్ష సాధింపు చర్యలకు దిగుతూ 'రెడ్ బుక్' రాజ్యాంగాన్ని అమలు చేస్తోందని విమర్శించారు వైసీపీ హయాంలో వెలుగు వెలిగిన విద్య, వైద్యం, సంక్షేమ వ్యవస్థలను కూటమి సర్కార్ పూర్తిగా నీరుగార్చిందని అట్టడుగు వర్గాల ప్రజలు నానా అగచాట్లు పడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తిరుమల లడ్డూ వివాదం, మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ వంటి అంశాలపై ప్రభుత్వం కావాలనే రాద్ధాంతం చేస్తోందని, ప్రశ్నించే వారిని తీవ్ర వేధింపులకు గురిచేస్తోందని జగన్ దృష్టికి తీసుకెళ్లారు.ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి స్పందిస్తూ..గత వైసీపీ ప్రభుత్వం చేపట్టిన ప్రజాహిత కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తూనే,కూటమి సర్కార్ అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను నిరంతరం ప్రజాక్షేత్రంలోనే ఎండగట్టాలని తమ్మినేని సీతారాంకు దిశానిర్దేశం చేశారు.
Admin
DNB News