DNB News - ఆంధ్రప్రదేశ్ / : విజయనగరం జిల్లా గజపతినగరం మండలంలో నిర్వహించిన వైఎస్సార్సీపీ గ్రామ కమిటీ విస్తృత స్థాయి సమావేశానికి కేవీజీఎస్ఎన్ హాజరై సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. గ్రామ అభివృద్ధి, పార్టీ బలోపేతం, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు వంటి అంశాలపై విశ్లేషణాత్మకంగా చర్చించారు. ఈ సందర్భంగా గ్రామ కమిటీ సభ్యులకు పలు మార్గదర్శకాలు అందిస్తూ, ప్రజల సమస్యలను తెలుసుకొని వాటి పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. పార్టీ కార్యకర్తలు ఐక్యంగా పనిచేసి, ప్రభుత్వ పథకాలను ప్రతి ఇంటికి చేరేలా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ , జెడ్పి చైర్మన్ చిన్న శ్రీను , స్థానిక నాయకులు, పార్టీ కార్యకర్తలు, గ్రామ కమిటీ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొని సమావేశాన్ని విజయవంతం చేశారు.
Admin
DNB News