DNB News - ఆంధ్రప్రదేశ్ / : అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆదోని మున్సిపల్ కార్యాలయం ఆధ్వర్యంలో మహిళా పారిశుద్ధ్య కార్మికులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఆదోని మున్సిపల్ కమిషనర్ నయూం అహ్మద్ మహిళా పారిశుద్ధ్య వర్కర్లకు శాలువాలు, పూలదండలు వేసి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా మహిళా వర్కర్ల చేత కేక్ కటింగ్ చేయించి మహిళా దినోత్సవాన్ని ఆనందంగా జరుపుకున్నారు. నగర పరిశుభ్రత కోసం మహిళా పారిశుద్ధ్య కార్మికులు చేస్తున్న సేవలను కమిషనర్ ప్రత్యేకంగా ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ శానిటరీ ఇన్స్పెక్టర్లు, మేస్త్రీలు మరియు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
Admin
DNB News