DNB News - ఆంధ్రప్రదేశ్ / : అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని కర్నూలు కలెక్టరేట్లోని సునయన ఆడిటోరియంలో నిర్వహించిన మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత, జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్ కలిసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. మహిళల సాధికారత, సమాన హక్కులు, సమాజ అభివృద్ధిలో మహిళల పాత్ర ఎంతో ముఖ్యమని వారు పేర్కొన్నారు. మహిళలు అన్ని రంగాల్లో ముందుకు సాగుతూ సమాజ అభివృద్ధికి కీలక పాత్ర పోషిస్తున్నారని తెలిపారు. మహిళల శక్తి, ప్రతిభను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలు అమలు చేస్తోందని వివరించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, మహిళా సంఘాల ప్రతినిధులు మరియు పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు.
Admin
DNB News