DNB News - ఆంధ్రప్రదేశ్ / : బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులు అర్పించారు. సామాజిక న్యాయం, సమానత్వం కోసం జీవితాంతం పోరాడిన మహానేత బాబు జగ్జీవన్ రామ్ సేవలను ఈ సందర్భంగా స్మరించుకున్నారు. ఈ కార్యక్రమం పార్టీ ఇంచార్జి మల్లప్ప ఆదేశాల మేరకు నిర్వహించబడింది. కార్యక్రమంలో పార్టీ నాయకులు యం. పులి రాజు మరియు పి.ఎస్. జయరాం మాట్లాడుతూ, బాబు జగ్జీవన్ రామ్ సేవలు అణగారిన వర్గాల అభ్యున్నతికి దేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాయని తెలిపారు. ఆయన ఆశయాలు నేటి సమాజానికి మార్గదర్శకమని, సమాన హక్కులు మరియు సమాన అవకాశాలు ప్రతి ఒక్కరికీ అందేలా కృషి చేయడం మనందరి బాధ్యత అని పేర్కొన్నారు. అలాగే యువత ఆయన ఆలోచనలను ఆదర్శంగా తీసుకుని సమాజంలో మార్పు తీసుకురావాలని, సామాజిక న్యాయం సాధనలో ప్రతి ఒక్కరు తమ వంతు పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా బాబు జగ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు స్థానిక ప్రజలు పాల్గొని మహానేతకు తమ గౌరవాన్ని తెలియజేశారు. పాల్గొన్న నాయకులు: విక్రమ్, మంచాలి రాజు, ఎల్లప్ప, జాలి మంచి వీరేష్, నాగరాజు, వెంకీ నాయక్, ఏవి వెంకటేష్, గౌస్, వలి భాష.
Admin
DNB News