Wednesday, 17 June 2026 03:06:29 PM
# డయాబెటిస్ నియంత్రణకు ఆధునిక వైద్య విధానాలపై అవగాహన అవసరం: టీజీఆర్‌ఎస్‌ఎస్‌డీఐ ఆర్గనైజింగ్ సెక్రటరీ డా. జి. దీప # గంగా జయంతిని వైభవంగా నిర్వహించేందుకు గంగపుత్ర సంఘం తీర్మానం.. # హమాలీ కార్మికుల సంక్షేమానికి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి..సీఐటీయూ.. # ఉచిత సమ్మర్ కబడ్డీ కోచింగ్ క్యాంప్ విజయవంతం – క్రీడాకారులకు సర్టిఫికెట్ల ప్రదానం.. # INTUC ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు గా కుక్కల రామకృష్ణ (RK ) నియామకం # కూటమి ప్రభుత్వ వెన్నుపోటు పాలనపై వైఎస్సార్‌సీపీ మహాధర్నా.. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్.. # కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై ఆదోనిలో వైఎస్సార్‌సీపీ భారీ నిరసన ర్యాలీ ఎన్నికల హామీలు అమలు చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ # ఆలూరు లో కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై వైఎస్సార్సీపీ నిరసన.. # ఆదోనిలో బీజేపీకి భారీ చేరికలు – 200 కుటుంబాలకు ఎమ్మెల్యే డా. పార్థసారధి ఘన స్వాగతం.. # రహదారి ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు: ఎస్పీ విక్రాంత్ పాటిల్... # ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక"కలకోవ గ్రామసభకు హాజరైన డిప్యూటీ సీఈవో మహాలక్ష్మి* # ఎమ్మిగనూరులో నీటి సమస్యలకు చెక్ – అధికారులతో ఎమ్మెల్యే జయ నాగేశ్వర రెడ్డి సమీక్ష... # హమాలీ కార్మికుల హక్కుల కోసం ఉద్యమాలను ఉధృతం చేస్తాం: ఐఎఫ్టియు.. # ప్రభుత్వ పాఠశాల టాపర్లకు ఘన సన్మానం – విద్యార్థులే దేశ భవిష్యత్తు: గుడిసె కృష్ణమ్మ.. # ఫిట్ ఇండియా ‘సండేస్ ఆన్ సైకిల్’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన అడిషనల్ ఎస్పీలు.. # ప్రైవేటు పాఠశాలలో అధిక ఫీజులు వసూలు చేస్తున్న యజమానులపై చర్యలు తీసుకోవాలి # ఎన్‌రోల్‌మెంట్ డ్రైవ్ విజయవంతానికి కళాశాల సిబ్బంది సమావేశం # * ఆర్మీ ఉద్యోగాల ఎంపికలో వస్తున్న మార్పులకు అనుగుణంగా శిక్షణ. # ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర శిక్షణా తరగతులను జయప్రదం చేయాలి – షాబీర్ భాష.. # పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి: జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి..

జగనన్న కాలనీలో రూ.128 కోట్ల కుంభకోణం – విచారణకు సిద్ధమైన ప్రభుత్వం: ఎమ్మెల్యే పార్థసారథి...

Date : 01 May 2026 11:48 AM Views : 67

DNB News - ఆంధ్రప్రదేశ్ / : గత ప్రభుత్వ హయాంలో పట్టణ పొలిమేరలో ఏర్పాటు చేసిన జగనన్న కాలనీ పేరుతో రూ.128 కోట్ల భారీ కుంభకోణం జరిగిందని ఎమ్మెల్యే పార్థసారథి ఆరోపించారు. ఈ వ్యవహారంపై కేసు నమోదు చేసి సమగ్ర విచారణ చేపట్టేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. గురువారం ఆయన జగనన్న కాలనీలో అసంపూర్తిగా మిగిలిపోయిన, నాసిరకంగా నిర్మించిన గృహాలను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు ఈ కుంభకోణాన్ని వెలికితీసే దిశగా సీఎం చంద్రబాబు నాయుడు మరియు సంబంధిత మంత్రులకు పలుమార్లు వివరించినట్లు పేర్కొన్నారు. పేదల గృహ నిర్మాణం కోసం రైతుల నుంచి 178 ఎకరాల భూమి కొనుగోలుకు ప్రభుత్వం రూ.24 కోట్లు కేటాయించగా, రైతులకు కేవలం రూ.8 కోట్లు మాత్రమే అందజేసి మిగతా నిధులను దుర్వినియోగం చేసినట్లు ఆరోపించారు. అలాగే 5000 గృహాలు నిర్మించాల్సి ఉండగా, తక్కువ నాణ్యతతో సగం పనులు మాత్రమే పూర్తి చేసి 4000 గృహాలు పూర్తయ్యాయని ప్రకటించడం అనుమానాస్పదమని విమర్శించారు. తలుపులు, ఫ్లోరింగ్, ప్లాస్టరింగ్, ఎలక్ట్రికల్ పనులు పూర్తి కాకుండానే ఇళ్లను పూర్తి చేసినట్లు చూపించడం తీవ్ర నిర్లక్ష్యానికి నిదర్శనమన్నారు. గృహ లబ్ధిదారులైన మహిళలు డ్వాక్రా సంఘాల ద్వారా రూ.30 వేల నుండి రూ.60 వేల వరకు అప్పులు చేసి కాంట్రాక్టర్లకు చెల్లించాల్సి వచ్చిందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ప్రతి ఇంటికి మంజూరు చేసిన రూ.1,80,000 నగదును కూడా కాంట్రాక్టర్లు స్వాధీనం చేసుకున్నట్లు ఆరోపించారు. జగనన్న కాలనీ లబ్ధిదారులైన సుమారు 5 వేల మంది ప్రస్తుతం ఇల్లు, స్థలాలపై అనిశ్చితిలో ఉన్నారని, వారికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఈ కుంభకోణంపై పూర్తి స్థాయి విచారణలో మరిన్ని సంచలన విషయాలు వెలుగులోకి వస్తాయని పేర్కొన్నారు. ప్రస్తుతం వెలుగులోకి వచ్చిన అంశాలు ట్రైలర్ మాత్రమేనని, పూర్తి నిజాలు బయటకు రావాల్సి ఉందని ఎమ్మెల్యే పార్థసారథి తెలిపారు.

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: