DNB News - ఆంధ్రప్రదేశ్ / : కర్నూలు నగరంలోని వినాయక ఘాట్ వద్ద నిర్వహించిన “ఆపరేషన్ క్లీన్ స్వీప్” కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డా. ఏ.సిరి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ చల్లా ఓబులేసు, విద్యార్థులు, అధికారులు, పారిశుద్ధ్య సిబ్బంది మరియు స్థానికులు పాల్గొని ఘాట్ పరిసరాలను శుభ్రపరిచారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ నగర పరిశుభ్రత ప్రతి పౌరుడి బాధ్యత అని తెలిపారు. ప్రజలు చెత్తను ఎక్కడ పడితే అక్కడ వేయకుండా పరిశుభ్రత పాటించాలని సూచించారు. ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించి పర్యావరణ పరిరక్షణకు అందరూ సహకరించాలని పిలుపునిచ్చారు. మున్సిపల్ కమిషనర్ చల్లా ఓబులేసు మాట్లాడుతూ నగరాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు మున్సిపల్ శాఖ ప్రత్యేక చర్యలు చేపడుతోందని తెలిపారు. విద్యార్థులు పరిశుభ్రతపై అవగాహన పెంపొందించి సమాజానికి ఆదర్శంగా నిలవాలని అన్నారు. కార్యక్రమంలో విద్యార్థులు స్వచ్ఛతపై నినాదాలు చేస్తూ ప్రజల్లో అవగాహన కల్పించారు. అధికారులు, సిబ్బంది కలిసి ఘాట్ పరిసర ప్రాంతాల్లో శుభ్రత కార్యక్రమాలు నిర్వహించారు.
Admin
DNB News