DNB News - ఆంధ్రప్రదేశ్ / : అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఒక రోజు ముందుగానే ఆదోని పట్టణంలోని ఆర్పి మహిళలు పెద్ద ఎత్తున హాజరై కర్నూలు జిల్లా టిడిపి అధ్యక్షురాలు శ్రీమతి గుడిసె ఆది కృష్ణమ్మ నివాసం (క్యాంప్ ఆఫీస్) వద్ద మహిళా దినోత్సవ వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలందరూ కలిసి కేక్ కట్ చేసి ఆనందంగా సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా గుడిసె ఆది కృష్ణమ్మ మాట్లాడుతూ మహిళలు సమాజ నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తున్నారని అన్నారు. మహిళ అంటే శక్తి, సాహసం, సృష్టి అని పేర్కొన్నారు. కుటుంబానికి ధైర్యం, సమాజానికి దారిదీపం, దేశానికి బలంగా నిలిచే ప్రతి మహిళకు తమ వందనాలు తెలియజేశారు. ప్రతి రంగంలో మహిళలు తమ ప్రతిభతో ముందుకు సాగుతూ సమాజానికి ఆదర్శంగా నిలుస్తున్నారని ఆమె పేర్కొన్నారు. మహిళల గౌరవం, భద్రత, సమాన హక్కులు కలిగిన సమాజం నిర్మాణం కోసం అందరం కలిసి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆదోని పట్టణానికి చెందిన మహిళలు, టిడిపి నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.
Admin
DNB News