DNB News - ఆంధ్రప్రదేశ్ / : బొబ్బిలిపేట గ్రామంలో రహదారుల నిర్మాణాలకు శంకుస్థాపన గ్రామీణ మౌలిక వసతులపై కూటమి ప్రభుత్వానికి ప్రత్యేక శ్రద్ధ – ఎమ్మెల్యే కూన రవికుమార్ ఆమదాలవలస నియోజకవర్గంలో ఆమదాలవలస మండలం బొబ్బిలిపేట గ్రామంలో పలు రహదారుల నిర్మాణాలకు ఆదివారం శంకుస్థాపన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆమదాలవలస నియోజకవర్గ శాసనసభ్యులు, రాష్ట్ర పియుసి చైర్మన్ శ్రీ కూన రవికుమార్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కూన రవికుమార్ మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంతాల్లో రహదారుల నిర్మాణాలకు కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని తెలిపారు. గ్రామాల అభివృద్ధి రహదారుల నుంచే ప్రారంభమవుతుందని, ప్రతి గ్రామానికి నాణ్యమైన రహదారి సౌకర్యం కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. బొబ్బిలిపేట నుంచి వెదుర్లవలస వరకు రూ.1.80 కోట్ల నాబార్డు నిధులతో నిర్మించనున్న రహదారి పనులకు శంకుస్థాపన చేసినట్లు తెలిపారు. ఈ రహదారి నిర్మాణంతో గ్రామాల మధ్య రాకపోకలు సులభమవడమే కాకుండా, రైతులకు తమ వ్యవసాయ ఉత్పత్తులను మార్కెట్కు తరలించడంలో ఎంతో ఉపయోగపడుతుందన్నారు. అదేవిధంగా, బొబ్బిలిపేట గ్రామంలో కూటమి ప్రభుత్వం వచ్చాక రూ .53 లక్షల వ్యయంతో నిర్మించిన *సిసి రోడ్లను కూడా ఆయన ఈరోజు ప్రారంభించారు . గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పనకు అధిక ప్రాధాన్యత ఇస్తూ ప్రజలకు మెరుగైన పాలన అందించడమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని స్పష్టం చేశారు. గ్రామీణ ప్రాంతాల్లోని అన్ని గ్రామాలకు రహదారి సౌకర్యం కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని, అభివృద్ధి కార్యక్రమాలు నిరంతరంగా కొనసాగుతాయని ఎమ్మెల్యే కూన రవికుమార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, ఆర్ అండ్ బి అధికారులు, గ్రామ పెద్దలు మరియు పెద్ద సంఖ్యలో గ్రామస్తులు పాల్గొన్నారు.
Admin
DNB News