DNB News - ఆంధ్రప్రదేశ్ / : మహా శివరాత్రి పవిత్ర దినాన్ని పురస్కరించుకొని ఆదోని మండలంలోని బైజిగేరి గ్రామంలో వెలసిన శ్రీ మాతా గంగా భవాని దేవాలయానికి మైక్ సెట్ విరాళంగా అందజేశారు. ఈ కార్యక్రమం స్థానిక నాయకుడు, మాజీ శాసనసభ్యులు శ్రీ ప్రకాష్ జైన్ వారి ఆధ్వర్యంలో జరిగింది. దేవాలయంలో జరిగే పూజా కార్యక్రమాలు, భజనలు మరియు ఆధ్యాత్మిక కార్యక్రమాలు మరింత సజావుగా నిర్వహించేందుకు ఈ మైక్ సెట్ ఉపయోగపడుతుందని ఈ సందర్భంగా తెలిపారు. దేవాలయ అభివృద్ధికి ఎల్లప్పుడూ సహకారం అందిస్తామని శ్రీ ప్రకాష్ జైన్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మలేకర్ శ్రీనివాస్, సీనియర్ పత్రికా విలేకరి భూమి ఈరన్న మరియు దేవాలయానికి సంబంధించిన గంగపుత్రులు సుమారు 50 మంది పాల్గొన్నారు. కార్యక్రమం భక్తిశ్రద్ధల మధ్య నిర్వహించబడింది.
Admin
DNB News