DNB News - ఆంధ్రప్రదేశ్ / : కర్నూలు కలెక్టరేట్ సునయన ఆడిటోరియంలో నిర్వహించిన "ప్రజా సమస్యల పరిష్కార వేదిక" (పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెసెల్ సిస్టమ్ - పిజిఆర్ఎస్) కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి, జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్ ప్రజల నుండి వినతులను స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. అందిన ప్రతి వినతిని పరిశీలించిన కలెక్టర్, సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రజల సమస్యలను త్వరితగతిన పరిష్కరించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని కలెక్టర్ పేర్కొన్నారు. ప్రతి ఫిర్యాదును సమగ్రంగా పరిశీలించి, న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొని ప్రజల వినతులను స్వీకరించి, పరిష్కార మార్గాలను సూచించారు.
Admin
DNB News