DNB News - ఆంధ్రప్రదేశ్ / : యెమ్మిగనూరు సబ్ డివిజన్ ఎస్సీడీపీవో ఆధ్వర్యంలో ఈరోజు ఆదోని సబ్ డివిజనల్ పోలీస్ కార్యాలయంలో క్రికెట్ బెట్టింగ్లలో పాల్గొంటున్న అనుమానితులకు ప్రత్యేక కౌన్సెలింగ్ నిర్వహించబడింది. ఈ సందర్భంగా బెట్టింగ్ కార్యకలాపాల్లో పాల్గొంటున్న వారికి కఠిన హెచ్చరికలు జారీ చేయబడింది. అక్రమ క్రికెట్ బెట్టింగ్లకు పాల్పడితే చట్టపరమైన కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. యువత తప్పుదారి పట్టకుండా ఉండాలని, చట్టాన్ని గౌరవించాలని సూచించారు. బెట్టింగ్ మాఫియాపై పోలీసులు నిఘా మరింత పెంచినట్లు తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటి కార్యకలాపాల్లో ఎవరు పాల్గొన్నా వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఆదోని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ సీఐ/ఎస్ఐ మరియు సిబ్బంది పాల్గొన్నారు.
Admin
DNB News