DNB News - ఆంధ్రప్రదేశ్ / : భారతమాత ముద్దుబిడ్డ భారతరత్న రాజ్యాంగ నిర్మాత డా.బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక దార్శనిక నాయకుడు, సాంఘిక సంస్కర్త అని ఆర్ఎస్ఎస్ జిల్లా సహసంఘ చాలకులు ఎలగందుల సత్యనారాయణ కొనియాడారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆధ్వర్యంలో మంగళవారం రోజున కరీంనగర్లోని అంబేద్కర్ స్టేడియంలో అంబేద్కర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఆర్ఎస్ఎస్ బాధ్యులు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఎలగందుల సత్యనారాయణ మాట్లాడుతూ భారత రాజ్యాంగ ప్రధాన రూపశిల్పి తీవ్రమైన కుల వివక్షను ఎదుర్కొన్నప్పటికీ, తన అద్భుతమైన విద్యా విజయాల ద్వారా ఆ సవాళ్లను అధిగమించి రాజ్యాంగ రూపకర్త అయ్యారని తెలిపారు. డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ యొక్క అత్యంత ప్రసిద్ధ నినాదం చదువుకోండి, పోరాడండి, సంఘటితం అవ్వండి . ఈ శక్తివంతమైన మూడు పదాల సందేశం సామాజిక సంస్కరణలకు స్ఫూర్తినిస్తుందన్నారు. మన దేశ అత్యున్నత చట్టమైన రాజ్యాంగాన్ని రూపొందించడంలో ఆయన పోషించిన అసాధారణ పాత్ర కారణంగా డాక్టర్ భీమ్ రావు అంబేద్కర్ ను భారత రాజ్యాంగ పితామహుడయారన్నారు. “స్వేచ్ఛ, సమానత్వం సౌభ్రాతృత్వాన్ని బోధించే మతం పట్ల హిందూ శబ్దానికి . హిందుత్వానికి విస్తృతమైన సమగ్రమైన నిర్వచనం ఆ రోజుల్లోనే అంబేద్కర్ ఇచ్చారని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. చివరగా అంబేద్కర్ బౌద్ధ మతాన్ని స్వీకరించారని తెలిపారు. ఈకార్యక్రమంలో విభాగ్ ప్రచారక్ భానుచందర్ , విభాగ్ ప్రచార ప్రముక్ శంకరయ్య , మండల కార్యవాహా కామారపు ప్రసాద్ స్వయంసేవక బంధువులు పాల్గొన్నారు. మాధవ సేవా సమితి కరీంనగర్ ఆధ్వర్యంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు నిర్వహించారు. కరీంనగర్లోని కేశవ నిలయం లో సమితి ప్రధాన కార్యదర్శి కామరపు ప్రసాద్, సభ్యులు ఎల్లoకి జలపతి రావు సంఘ ప్రముఖుల సమక్షంలో కార్యక్రమం జరిగింది.
Admin
DNB News