DNB News - ఆంధ్రప్రదేశ్ / : రొంపిచర్ల మండలం లోని ఆసరా స్వచ్చంద సేవా సంస్థ అధ్యక్షులు వల్లిపాగు ధనంజయ ఆధ్వర్యంలో బాబు జగజ్జీవన్ రామ్ జయంతి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా విద్యావేత్త డాక్టర్ టి. రఘునాథ్, గ్రేట్ విజన్ సొసైటీ అధ్యక్షులు జి వి ఎస్ బాబు మాట్లాడుతూ కుల వివక్ష కు వ్యతిరేకం గా పోరాటాలు, భారత స్వాతంత్ర సమరంలో కీలక పోరాటం, చేశారు. అలాగే 1946-1986 వరకు రాజకీయ ప్రస్థానం లో ఉత్తమ పార్లమెంటరియన్ గా అరుదైన రికార్డ్. రక్షణ, కార్మిక, వ్యవసాయ, రైల్వే &రవాణా వంటి కేంద్ర మంత్రిత్వ శాఖల్లో మంత్రి గా సమర్థతతో, వ్యూహత్మాకంగా పదవులకే వన్నె తెచ్చారు. భారతదేశo గర్వించదగ్గ విధంగా ఉప ప్రధానిగా, ప్రజాస్వామ్యం కు సరికొత్త నిర్వచనం గా ఏదిగారు. దళితుల సంక్షేమ మే కాకుండా బడుగు బలహీన వర్గాల వారికి, దేశ సంక్షేమ పథకాలు అమలులో ఆయన పాత్ర అజరామరం. సమానత్వ ఉద్యమాలకు చైతన్యం, రాజ్యాంగ సభ సభ్యుడిగా అయన పాత్ర సామాజిక న్యాయం, హక్కులు, ఆత్మ గౌరవం యొక్క విలువలు స్థిరంగా ఉండేలా నిర్ణయం చేశారు. ఒక దేశ భక్తుడు గా, రాజనీతి, సామాజిక న్యాయం యొక్క సూత్ర దారిగా దేశానికి ఒక గర్వ కారణం, వారి ఆలోచనలు నేటి సమాజానికి ఆదర్శం. వారి జన్మదినo పురస్కరించుకొని సమతా దివస్ గా ప్రకటించడం అయింది.కార్యక్రమం లో శ్రీనివాసా ఫోటో స్టూడియో అధినేత మల్లేపల్లి వెంకటేష్, సీనియర్ సిటిజన్ R. రాజన్న, ఆసరా సభ్యులు N. ఓబులేసు తదితరులు పాల్గొన్నారు.
Admin
DNB News