Saturday, 18 April 2026 02:36:13 PM
# రైతులు ధాన్యంలో తాలు లేకుండా కొనుగోలు కేంద్రానికి తీసుకుని రావాలి... జిల్లావ్యవసాయ అధికారి శ్రీధర్ రెడ్డి # బీసీవై పార్టీ ధర్మ దీక్షలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ పై అనుచిత వ్యాఖ్యలు # ఆరోగ్య సూత్రాలు పాటించండి శ్రమదానం చేయండి ఆరోగ్యంగా ఉండండి # ఓ పెళ్లి వేడుకలో కేటరింగ్ గుత్తేదారు దుశ్చర్యతో విషాద వాతావరణం అలముకొంది. # ఇల్లందు ప్రభుత్వ వైద్యశాల ను ఈరోజు కాయకల్ప ఎక్స్టర్నల్ అసెస్మెంట్ టీం డాక్టర్ రఘు పూజారి, డాక్టర్ జోత్స్న మరియు వారి బృందం సందర్శించారు # ఉపాధిహామీకూలీలకు రోజు 600 రూపాయల చెల్లించాలి వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు కామ్రేడ్ ములకలపల్లి రాములు డిమాండ్ # జీఎస్టీ అమలు సమన్వయంపై కలెక్టరేట్‌లో సమీక్ష సమావేశం # రాయలసీమ సాగునీటి హక్కుల కోసం వైఎస్ఆర్సీపీ సమాలోచన సమావేశం # కేంద్ర మంత్రి బండి సంజయ్ ని కలిసిన ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం # విద్యార్థుల ప్రాణాలతో ఆటలాడుతున్న స్కూల్ యాజమాన్యం – ఇంకా చర్యలు ఎందుకు లేవు?”.. # అల్ఫోర్స్ ఇ-టెక్నో స్కూల్ లో డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ వర్ధంతి # ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఉద్యోగ భద్రత కల్పించాలి. # టి డి పి రాష్ట్ర అధ్యక్షులుగా రెండవసారి నియమితులైన పల్లా శ్రీనివాసరావు సన్మానించి, శుభాకాంక్షలు తెలిపిన బొండా యల్లాజీరావు, శ్రీదేవి లు # శాతవాహన అభివృద్ధికి కృషి - నూతన కార్యనిర్వాహక మండలి సభ్యులు # కాంగ్రెస్ సీనియర్ మైనార్టీ మహిళా నాయకురాలు సమాన మహమ్మద్ # గోడౌన్ నిర్మాణానికి స్థలాన్ని పరిశీలించిన రాష్ట్ర గిడ్డంగుల సంస్ధ చైర్మన్ రాయల నాగేశ్వరరావు.. # ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రి లో ఫ్రీజర్ పని చేయక పోవడం తో చనిపోయిన వారు పరిస్థితి దారుణం # తిరుమలాయపాలెం మండలం పిండిప్రోలు లో ఓ ఇంట్లో చోరీ # బిజెపి మండల ప్రధాన కార్యదర్శిగా భాషబోయిన ప్రదీప్ యాదవ్ నియామకం # ఘనంగా కిసాన్ నగర్ హిందూ సమ్మేళనం

ఆదోని పట్టణ సమస్యలపై తక్షణ చర్యలు కోరిన సిపిఎం నాయకులు..

Date : 18 February 2026 11:18 AM Views : 60

DNB News - ఆంధ్రప్రదేశ్ / : ఆదోని పట్టణంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ సిపిఎం పార్టీ నాయకులు నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ఆదోని మున్సిపల్ కమిషనర్ నయూం ని కలిసి సమస్యలతో స్వాగతం పలికి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పట్టణ కార్యదర్శి లక్ష్మన్న, సీనియర్ నాయకులు ఈరన్న, నాయకులు గోపాల్, తిప్పన్న, వీరేష్, నాగరాజు, వెంకటేష్, అజీమ్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, ఆదోని పట్టణంలో సమస్యలు “ఎక్కడ వేసిన గొంగళి అక్కడే” అన్న చందంగా ఉన్నాయని విమర్శించారు. కర్నూలు జిల్లాలోని ఆదోని దాదాపు 165 సంవత్సరాల చరిత్ర కలిగిన పురాతన మున్సిపాలిటీగా, ఒకప్పుడు “రెండవ ముంబై”గా ప్రసిద్ధి చెందిన పట్టణమని గుర్తుచేశారు. అయితే పాలకుల నిర్లక్ష్యంతో పట్టణం అభివృద్ధికి ఆమడ దూరంలో ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రధానంగా పాత ఫ్లైఓవర్ బ్రిడ్జి ప్రమాదకర స్థితిలో ఉండి కూలే పరిస్థితిలో ఉన్నప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేదని తెలిపారు. నిత్యం ప్రజలు ప్రమాదాలకు గురవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. మున్సిపాలిటీ షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణ పనులను వేగవంతం చేసి లబ్ధిదారులకు కేటాయించాలని డిమాండ్ చేశారు. పట్టణంలో రోడ్లు వెడల్పు కార్యక్రమం చేపట్టి ట్రాఫిక్ సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలని కోరారు. అలాగే పట్టణంలో ఆహ్లాదకరమైన పార్కులు ఏర్పాటు చేసి, ప్రస్తుత పార్కుల్లో పిల్లల ఆటపరికరాలు ఏర్పాటు చేయాలని సూచించారు. పట్టణ జనాభా పెరుగుదలను దృష్టిలో ఉంచుకుని అదనంగా మరొక సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేశారు. ప్రజా సమస్యల పరిష్కారంలో మున్సిపల్ అధికారులు చొరవ చూపాలని సిపిఎం నాయకులు విజ్ఞప్తి చేశారు.

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :