DNB News - ఆంధ్రప్రదేశ్ / : మంత్రాలయం మండలం చిలకలడోణ సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాద సంఘటన స్థలాన్ని కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఐపియస్ గురువారం ఉదయం పరిశీలించారు. ఘటన స్థలానికి చేరుకున్న ఎస్పీ ప్రమాదానికి గల కారణాలు, పరిస్థితులను సమగ్రంగా పరిశీలించి వివరాలు సేకరించారు. మంత్రాలయం దర్శనానికి వెళ్తున్న కర్ణాటకకు చెందిన 8 మంది మృతి చెందడం చాలా దురదృష్టకరమని ఆయన విచారం వ్యక్తం చేశారు. బొలెరో వాహనం రెడిమిక్స్ ట్యాంకర్ను ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగినట్లు ప్రాథమికంగా గుర్తించామని తెలిపారు. ప్రమాదంలో గాయపడిన వారికి తక్షణమే మెరుగైన వైద్యసేవలు అందేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు చెప్పారు. ఈ ఘటనపై ఇప్పటికే కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించామని, ఎమ్మిగనూరు డీఎస్పీ భార్గవి విచారణ చేపట్టినట్లు ఎస్పీ తెలిపారు. ప్రజలు వాహనాలు నడిపేటప్పుడు రహదారి భద్రతా నియమాలను తప్పనిసరిగా పాటించాలని, సురక్షిత ప్రయాణం కోసం జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా కర్నూలు ఎస్పీ తో పాటు ఎమ్మిగనూరు టౌన్ సిఐ శ్రీనివాసులు, మంత్రాలయం ఎస్సై మల్లికార్జున తదితరులు పాల్గొన్నారు.
Admin
DNB News