DNB News - ఆంధ్రప్రదేశ్ / : ప్రభుత్వ మాతా–శిశు ఆసుపత్రికి వచ్చే గర్భిణీ స్త్రీలను ప్రైవేట్ నర్సింగ్ హోంలకు పంపించే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి హెచ్చరించారు. గురువారం ఆదోని ఎంసీహెచ్ (మాతా శిశు) ఆసుపత్రిలో హాస్పిటల్ డెవలప్మెంట్ కమిటీ (HDC) సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే పార్థసారథి హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆధునీకరణ, మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. హాస్పిటల్ డెవలప్మెంట్ కమిటీ సమావేశంలో ఆసుపత్రి మౌలిక సదుపాయాలు, వైద్య సేవల మెరుగుదలపై సమీక్ష నిర్వహించినట్లు చెప్పారు. పేద ప్రజలకు నాణ్యమైన చికిత్స అందించేందుకు వైద్యుల లభ్యత, మందుల సరఫరా, ఆసుపత్రి పరిశుభ్రత వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి పెడతామని పేర్కొన్నారు. అవసరమైన సిబ్బంది కొరత లేకుండా ప్రభుత్వం తో మాట్లాడి త్వరలోనే చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సూపరింటెండెంట్, కమిటీ సభ్యులు మరియు హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు.
Admin
DNB News