Saturday, 18 April 2026 06:10:21 PM
# టీనేజ్ ప్రెగ్నెన్సిలు , బాల్య వివాహాల నివారణపై కర్నూలులో కఠిన చర్యలు – SOP అమలుపై కలెక్టర్ సమీక్ష.. # మంగ్లీపై ఆరోపణల్ని ఖండిస్తున్నాం..అడ్వకేట్స్ అసోసియేషన్ నాయకులు భూక్యా హరినాయక్ # విజయవాడలో బిజెపి కీలక సమావేశం – రాబోయే కార్యక్రమాలపై దిశానిర్దేశం.. # పోచమ్మ చెరువులో పూడికతీత పనులకు భూమి పూజ – స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్రపై కలెక్టర్ డా.ఏ.సిరి అవగాహన # స్వర్ణాంధ్ర–స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా కర్నూలు జిల్లాలో పోలీసుల స్వచ్ఛత కార్యక్రమాలు... # శాతవాహనలో ప్రశాంతంగా డిగ్రీ పరీక్షలు # విశ్వహిందూ పరిషత్ బజరంగ్ దళ్ కరీంనగర్ # అల్ఫోర్స్ ఇ-టెక్నో స్కూల్ విద్యార్థులకు అంతర్జాతీయ మ్యాథ్స్ ఒలంపియాడ్ లో పతకాలు # రైతులు ధాన్యంలో తాలు లేకుండా కొనుగోలు కేంద్రానికి తీసుకుని రావాలి... జిల్లావ్యవసాయ అధికారి శ్రీధర్ రెడ్డి # బీసీవై పార్టీ ధర్మ దీక్షలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ పై అనుచిత వ్యాఖ్యలు # ఆరోగ్య సూత్రాలు పాటించండి శ్రమదానం చేయండి ఆరోగ్యంగా ఉండండి # ఓ పెళ్లి వేడుకలో కేటరింగ్ గుత్తేదారు దుశ్చర్యతో విషాద వాతావరణం అలముకొంది. # ఇల్లందు ప్రభుత్వ వైద్యశాల ను ఈరోజు కాయకల్ప ఎక్స్టర్నల్ అసెస్మెంట్ టీం డాక్టర్ రఘు పూజారి, డాక్టర్ జోత్స్న మరియు వారి బృందం సందర్శించారు # ఉపాధిహామీకూలీలకు రోజు 600 రూపాయల చెల్లించాలి వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు కామ్రేడ్ ములకలపల్లి రాములు డిమాండ్ # జీఎస్టీ అమలు సమన్వయంపై కలెక్టరేట్‌లో సమీక్ష సమావేశం # రాయలసీమ సాగునీటి హక్కుల కోసం వైఎస్ఆర్సీపీ సమాలోచన సమావేశం # కేంద్ర మంత్రి బండి సంజయ్ ని కలిసిన ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం # విద్యార్థుల ప్రాణాలతో ఆటలాడుతున్న స్కూల్ యాజమాన్యం – ఇంకా చర్యలు ఎందుకు లేవు?”.. # అల్ఫోర్స్ ఇ-టెక్నో స్కూల్ లో డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ వర్ధంతి # ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఉద్యోగ భద్రత కల్పించాలి.

గర్భిణీలను ప్రైవేట్ నర్సింగ్ హోంలకు పంపితే కఠిన చర్యలు: ఎమ్మెల్యే పార్థసారథి హెచ్చరిక

Date : 12 March 2026 05:57 PM Views : 48

DNB News - ఆంధ్రప్రదేశ్ / : ప్రభుత్వ మాతా–శిశు ఆసుపత్రికి వచ్చే గర్భిణీ స్త్రీలను ప్రైవేట్ నర్సింగ్ హోంలకు పంపించే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి హెచ్చరించారు. గురువారం ఆదోని ఎంసీహెచ్ (మాతా శిశు) ఆసుపత్రిలో హాస్పిటల్ డెవలప్‌మెంట్ కమిటీ (HDC) సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే పార్థసారథి హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆధునీకరణ, మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. హాస్పిటల్ డెవలప్‌మెంట్ కమిటీ సమావేశంలో ఆసుపత్రి మౌలిక సదుపాయాలు, వైద్య సేవల మెరుగుదలపై సమీక్ష నిర్వహించినట్లు చెప్పారు. పేద ప్రజలకు నాణ్యమైన చికిత్స అందించేందుకు వైద్యుల లభ్యత, మందుల సరఫరా, ఆసుపత్రి పరిశుభ్రత వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి పెడతామని పేర్కొన్నారు. అవసరమైన సిబ్బంది కొరత లేకుండా ప్రభుత్వం తో మాట్లాడి త్వరలోనే చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సూపరింటెండెంట్, కమిటీ సభ్యులు మరియు హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు.

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :