DNB News - ఆంధ్రప్రదేశ్ / : “ఒక్క నెల - ఒక నియోజకవర్గం - నాలుగు పర్యటనలు” కార్యక్రమంలో భాగంగా పాణ్యం నియోజకవర్గం రెండవ పర్యటన సందర్భంగా కర్నూలు మున్సిపల్ కౌన్సిల్ హాల్లో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి ప్రజల నుండి వినతులను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో పాణ్యం ఎమ్మెల్యే చరితా రెడ్డి , జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్ పాల్గొని ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకున్నారు. వివిధ గ్రామాలు మరియు పట్టణ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజలు తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. ప్రజల వినతులను సంబంధిత శాఖల అధికారులకు పంపించి, త్వరితగతిన పరిష్కారం చూపించాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రతి అర్హులైన లబ్ధిదారులకు చేరేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. పాణ్యం ఎమ్మెల్యే చరితా రెడ్డి గారు మాట్లాడుతూ, ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, ప్రతి వినతిని సానుకూలంగా పరిశీలిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు మరియు పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.
Admin
DNB News