Saturday, 18 April 2026 02:06:56 PM
# రైతులు ధాన్యంలో తాలు లేకుండా కొనుగోలు కేంద్రానికి తీసుకుని రావాలి... జిల్లావ్యవసాయ అధికారి శ్రీధర్ రెడ్డి # బీసీవై పార్టీ ధర్మ దీక్షలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ పై అనుచిత వ్యాఖ్యలు # ఆరోగ్య సూత్రాలు పాటించండి శ్రమదానం చేయండి ఆరోగ్యంగా ఉండండి # ఓ పెళ్లి వేడుకలో కేటరింగ్ గుత్తేదారు దుశ్చర్యతో విషాద వాతావరణం అలముకొంది. # ఇల్లందు ప్రభుత్వ వైద్యశాల ను ఈరోజు కాయకల్ప ఎక్స్టర్నల్ అసెస్మెంట్ టీం డాక్టర్ రఘు పూజారి, డాక్టర్ జోత్స్న మరియు వారి బృందం సందర్శించారు # ఉపాధిహామీకూలీలకు రోజు 600 రూపాయల చెల్లించాలి వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు కామ్రేడ్ ములకలపల్లి రాములు డిమాండ్ # జీఎస్టీ అమలు సమన్వయంపై కలెక్టరేట్‌లో సమీక్ష సమావేశం # రాయలసీమ సాగునీటి హక్కుల కోసం వైఎస్ఆర్సీపీ సమాలోచన సమావేశం # కేంద్ర మంత్రి బండి సంజయ్ ని కలిసిన ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం # విద్యార్థుల ప్రాణాలతో ఆటలాడుతున్న స్కూల్ యాజమాన్యం – ఇంకా చర్యలు ఎందుకు లేవు?”.. # అల్ఫోర్స్ ఇ-టెక్నో స్కూల్ లో డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ వర్ధంతి # ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఉద్యోగ భద్రత కల్పించాలి. # టి డి పి రాష్ట్ర అధ్యక్షులుగా రెండవసారి నియమితులైన పల్లా శ్రీనివాసరావు సన్మానించి, శుభాకాంక్షలు తెలిపిన బొండా యల్లాజీరావు, శ్రీదేవి లు # శాతవాహన అభివృద్ధికి కృషి - నూతన కార్యనిర్వాహక మండలి సభ్యులు # కాంగ్రెస్ సీనియర్ మైనార్టీ మహిళా నాయకురాలు సమాన మహమ్మద్ # గోడౌన్ నిర్మాణానికి స్థలాన్ని పరిశీలించిన రాష్ట్ర గిడ్డంగుల సంస్ధ చైర్మన్ రాయల నాగేశ్వరరావు.. # ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రి లో ఫ్రీజర్ పని చేయక పోవడం తో చనిపోయిన వారు పరిస్థితి దారుణం # తిరుమలాయపాలెం మండలం పిండిప్రోలు లో ఓ ఇంట్లో చోరీ # బిజెపి మండల ప్రధాన కార్యదర్శిగా భాషబోయిన ప్రదీప్ యాదవ్ నియామకం # ఘనంగా కిసాన్ నగర్ హిందూ సమ్మేళనం

విచారణ జరిపి చట్టపరంగా న్యాయం చేస్తాం : కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్...

Date : 02 February 2026 06:07 PM Views : 83

DNB News - ఆంధ్రప్రదేశ్ / : ప్రజా ఫిర్యాదులపై త్వరితగతిన స్పందించి పరిష్కారం చూపాలని పోలీసు అధికారులను కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ ఆదేశించారు. కర్నూల్ కొత్తపేటలోని కర్నూల్ టూ టౌన్ పోలీస్ స్టేషన్ ప్రక్కన ఉన్న ఎస్పీ క్యాంపు కార్యాలయంలో సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (Public Grievance Redressal System) కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల సమస్యల వినతులను ఎస్పీ స్వయంగా స్వీకరించి, ఫిర్యాదిదారులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమానికి మొత్తం 125 ఫిర్యాదులు అందాయి. ప్రధాన ఫిర్యాదులు ఇవి : పత్తికొండ లక్ష్మీనగర్‌కు చెందిన లోకేష్ బాబు, ఎండోమెంట్ డిపార్ట్మెంట్లో ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి ఇద్దరు వ్యక్తులు రూ.10 లక్షలు తీసుకొని మోసం చేశారని ఫిర్యాదు చేశారు. గోనెగండ్ల మండలం అల్వాల గ్రామానికి చెందిన చిన్న లక్ష్మన్న, ఎమ్మిగనూరు టౌన్‌లోని తన ఎస్‌బీఐ కస్టమర్ సర్వీస్ పాయింట్ వద్ద రూ.1 లక్ష 10 వేల ఫోన్‌పే చేయించుకుని, రూ.50 వేలు మాత్రమే ఇచ్చి మిగిలిన డబ్బులు ఇవ్వకుండా మోసం చేశారని ఫిర్యాదు చేశారు. కర్నూలు బాలాజీ నగర్‌కు చెందిన మన్సూర్ అహ్మద్, రైల్వే, ఇన్‌కమ్ ట్యాక్స్, నామినేటెడ్ ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి ఢిల్లీ, ముంబాయికి చెందిన వ్యక్తులు రూ.20 లక్షలు తీసుకొని మోసం చేశారని ఫిర్యాదు చేశారు. గూడూరు మండలం చనుగొండ్ల గ్రామానికి చెందిన విజయకుమార్, వృద్ధాప్యం మరియు అనారోగ్యంతో ఉన్న తనను కుమారుడు రవి మానసికంగా, శారీరకంగా వేధిస్తున్నాడని న్యాయం చేయాలని కోరారు. కోడుమూరు మండలం పాలకుర్తి గ్రామానికి చెందిన మహమ్మద్ షఫీ ఉల్లా, తనపై చెడు ప్రయోగాలు చేసి ఆరోగ్యం క్షీణింపజేశారని, సంబంధిత వారిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ విక్రాంత్ పాటిల్ మాట్లాడుతూ, ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికకు వచ్చిన అన్ని ఫిర్యాదులపై చట్ట ప్రకారం విచారణ జరిపి బాధితులకు న్యాయం చేస్తామని, సమస్యలను త్వరితగతిన పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కర్నూలు డీఎస్పీ బాబు ప్రసాద్, సీఐలు శివశంకర్, రమేష్, విజయలక్ష్మి పాల్గొన్నారు.

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :