DNB News - ఆంధ్రప్రదేశ్ / : పవిత్ర రంజాన్ పండుగను పురస్కరించుకుని కర్నూలు సబ్ డివిజన్ పరిధిలోని 100 మంది హోమ్ గార్డులకు బియ్యం ప్యాకెట్లను కర్నూలు డీఎస్పీ శ్రీ జె. బాబు ప్రసాద్ పంపిణీ చేశారు. సోమవారం కర్నూలు పట్టణంలోని డీఎస్పీ కార్యాలయంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. కోడుమూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ మహమ్మద్ తబ్రేజ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి డీఎస్పీ బాబు ప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరై హోమ్ గార్డులకు బియ్యం ప్యాకెట్లు అందజేశారు. సమాజ సేవలో భాగస్వాములవుతున్న మహేశ్వర్ రెడ్డి, ఈదుల దేవర బండ సుభాన్, క్వాలిటీ టైల్స్ రఫీ, మదీనా స్వీట్స్ రహమతుల్లాలను డీఎస్పీ శాలువాలతో సత్కరించి వారి సేవా భావాన్ని అభినందించారు. అనంతరం మౌలానా సలామ్ ప్రత్యేక ప్రార్థనలు (దువా) నిర్వహించి అందరికీ రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా డీఎస్పీ బాబు ప్రసాద్ మాట్లాడుతూ పవిత్ర రంజాన్ మాసంలో ఉపవాస దీక్షలో ఉంటూనే ప్రజల భద్రత కోసం విధులు నిర్వహిస్తున్న హోమ్ గార్డులను అభినందించారు. పోలీసు శాఖ హిందూ-ముస్లిం ఐక్యతకు నిదర్శనమని పేర్కొన్నారు. కర్నూలు సబ్ డివిజన్ పరిధిలోని పోలీసు అధికారులు, సిబ్బంది మరియు వారి కుటుంబ సభ్యులు పండుగలను ఆనందంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు. రంజాన్ పండుగ నేర్పే క్రమశిక్షణ, త్యాగం మరియు సోదరభావాన్ని ప్రతి ఒక్కరూ అలవర్చుకోవాలని, కులమతాలకు అతీతంగా అందరూ ఐక్యంగా ఉండి శాంతియుత సమాజ నిర్మాణానికి తోడ్పడాలని ఆయన పిలుపునిచ్చారు.
Admin
DNB News