DNB News - ఆంధ్రప్రదేశ్ / : స్వచ్ఛ ఆంధ్ర – స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఆదోని పట్టణ పరిధిలోని మండగిరి గ్రామంలో పరిశుభ్రత కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి గుడిసె కృష్ణమ్మ పాల్గొని గ్రామంలో స్వచ్ఛత కార్యక్రమాలను నిర్వహించారు. గ్రామాన్ని పరిశుభ్రంగా, అభివృద్ధి దిశగా తీర్చిదిద్దడమే ప్రధాన లక్ష్యంగా ప్రజలతో కలిసి స్వచ్ఛత కార్యక్రమాలు చేపట్టారు. గ్రామ ప్రజలకు పరిశుభ్రత యొక్క ప్రాముఖ్యతను వివరిస్తూ, పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని అవగాహన కల్పించారు. ప్రజల భాగస్వామ్యంతోనే స్వర్ణాంధ్ర సాధ్యమవుతుందని, ప్రతి ఒక్కరూ తమ గ్రామ అభివృద్ధికి తోడ్పడాలని ఆమె పిలుపునిచ్చారు. పరిశుభ్రమైన గ్రామం ద్వారానే ఆరోగ్యవంతమైన సమాజం నిర్మాణం సాధ్యమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో DLPO తిక్కమ్మ, MPDO నాగరాజు, సెక్రటరీ శ్రీనివాస్, EORD నాగరాజు, మాజీ MPP మురళి, బాబురావు, మాజీ కౌన్సిలర్ మారుతి, సోమిరెడ్డి నాగేంద్ర, మల్లి రాజశేఖర్, భరత్, చంద్ర తదితరులు పాల్గొన్నారు.
Admin
DNB News