Saturday, 18 April 2026 02:16:02 PM
# రైతులు ధాన్యంలో తాలు లేకుండా కొనుగోలు కేంద్రానికి తీసుకుని రావాలి... జిల్లావ్యవసాయ అధికారి శ్రీధర్ రెడ్డి # బీసీవై పార్టీ ధర్మ దీక్షలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ పై అనుచిత వ్యాఖ్యలు # ఆరోగ్య సూత్రాలు పాటించండి శ్రమదానం చేయండి ఆరోగ్యంగా ఉండండి # ఓ పెళ్లి వేడుకలో కేటరింగ్ గుత్తేదారు దుశ్చర్యతో విషాద వాతావరణం అలముకొంది. # ఇల్లందు ప్రభుత్వ వైద్యశాల ను ఈరోజు కాయకల్ప ఎక్స్టర్నల్ అసెస్మెంట్ టీం డాక్టర్ రఘు పూజారి, డాక్టర్ జోత్స్న మరియు వారి బృందం సందర్శించారు # ఉపాధిహామీకూలీలకు రోజు 600 రూపాయల చెల్లించాలి వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు కామ్రేడ్ ములకలపల్లి రాములు డిమాండ్ # జీఎస్టీ అమలు సమన్వయంపై కలెక్టరేట్‌లో సమీక్ష సమావేశం # రాయలసీమ సాగునీటి హక్కుల కోసం వైఎస్ఆర్సీపీ సమాలోచన సమావేశం # కేంద్ర మంత్రి బండి సంజయ్ ని కలిసిన ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం # విద్యార్థుల ప్రాణాలతో ఆటలాడుతున్న స్కూల్ యాజమాన్యం – ఇంకా చర్యలు ఎందుకు లేవు?”.. # అల్ఫోర్స్ ఇ-టెక్నో స్కూల్ లో డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ వర్ధంతి # ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఉద్యోగ భద్రత కల్పించాలి. # టి డి పి రాష్ట్ర అధ్యక్షులుగా రెండవసారి నియమితులైన పల్లా శ్రీనివాసరావు సన్మానించి, శుభాకాంక్షలు తెలిపిన బొండా యల్లాజీరావు, శ్రీదేవి లు # శాతవాహన అభివృద్ధికి కృషి - నూతన కార్యనిర్వాహక మండలి సభ్యులు # కాంగ్రెస్ సీనియర్ మైనార్టీ మహిళా నాయకురాలు సమాన మహమ్మద్ # గోడౌన్ నిర్మాణానికి స్థలాన్ని పరిశీలించిన రాష్ట్ర గిడ్డంగుల సంస్ధ చైర్మన్ రాయల నాగేశ్వరరావు.. # ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రి లో ఫ్రీజర్ పని చేయక పోవడం తో చనిపోయిన వారు పరిస్థితి దారుణం # తిరుమలాయపాలెం మండలం పిండిప్రోలు లో ఓ ఇంట్లో చోరీ # బిజెపి మండల ప్రధాన కార్యదర్శిగా భాషబోయిన ప్రదీప్ యాదవ్ నియామకం # ఘనంగా కిసాన్ నగర్ హిందూ సమ్మేళనం

నిబంధనలు ఉల్లంఘించిన శ్రీ బాలాజీ విద్యానికేతన్‌పై క్రిమినల్ కేసు నమోదు చేయాలి – SFI హెచ్చరిక.

Date : 04 April 2026 11:48 AM Views : 22

DNB News - ఆంధ్రప్రదేశ్ / : ఆదోని పట్టణంలోని హనుమాన్ నగర్‌లో ఉన్న శ్రీ బాలాజీ విద్యానికేతన్ పాఠశాల యాజమాన్యం నిర్లక్ష్యం, ప్రభుత్వ నిబంధనల ఉల్లంఘన వల్ల ఇద్దరు చిన్నారులు తీవ్రంగా గాయపడిన ఘటన తీవ్ర ఆందోళనకు గురిచేస్తోందని SFI జిల్లా ఉపాధ్యక్షుడు శ్రీనివాసులు మండిపడ్డారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పాఠశాలలో మూడో తరగతి చదువుతున్న చరణ్, అరవింద్ అనే విద్యార్థులు తరగతి గదిలో పైకప్పు పెచ్చులూడి తలపై పడడంతో తీవ్రంగా గాయపడి ప్రస్తుతం ఆదోని ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని తెలిపారు. ఈ ఘటన పాఠశాల యాజమాన్యం నిర్లక్ష్యానికి నిదర్శనమని ఆగ్రహం వ్యక్తం చేశారు. గుడ్ ఫ్రైడే పండుగ సందర్భంగా ప్రభుత్వ సెలవు ఉన్నప్పటికీ, పాఠశాలకు సెలవు ఇవ్వకుండా నిబంధనలకు విరుద్ధంగా తరగతులు నిర్వహించడం చాలా తీవ్రమైన తప్పిదమని పేర్కొన్నారు. ఇలాంటి బాధ్యతారాహిత్య వైఖరి విద్యార్థుల ప్రాణాలకు ప్రమాదం కలిగిస్తోందని అన్నారు. గాయపడిన విద్యార్థులకు అత్యుత్తమ వైద్యం అందించాలని, వారి కుటుంబాలకు పూర్తి సహాయం చేయాలని పాఠశాల యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు. అలాగే ఈ ఘటనపై వెంటనే స్పందించి, సంబంధిత పాఠశాల యాజమాన్యంపై క్రిమినల్ కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని విద్యాశాఖ అధికారులను కోరారు. ఈ కార్యక్రమంలో SFI పట్టణ అధ్యక్షుడు సంజయ్, కార్యదర్శి శశిధర్ పాల్గొన్నారు. అధికారులు తక్షణమే చర్యలు తీసుకోకపోతే, SFI ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :