DNB News - ఆంధ్రప్రదేశ్ / : ఆదోని మండలంలో ఫిబ్రవరి 12న దేశవ్యాప్తంగా నిర్వహించనున్న సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని కోరుతూ ఆటో జాత నిర్వహించారు. పెద్ద తుంబలం నుంచి ప్రారంభమైన జాత కుప్పగల్లు, పాండవగల్లు, బల్లెకల్లు, గనేకల్లు, కడితోట సహా పలు గ్రామాల్లో కొనసాగింది. గ్రామాల్లో జరిగిన సభల్లో కే.లింగన్న, బి.వీరారెడ్డి, రామాంజనేయులు, జే.రామాంజనేయులు మాట్లాడుతూ కార్మిక, రైతు వ్యతిరేక చట్టాల రద్దు, ఎంఎన్ఆర్ఈజీఎస్ కొనసాగింపు, లేబర్ కోడ్లు, విద్యుత్ సవరణ చట్టం ఉపసంహరణ కోరారు. ఫిబ్రవరి 12 సమ్మెలో ప్రజలంతా పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
Admin
DNB News