DNB News - తెలంగాణ / : భారత రాష్ట్ర సమితి బిఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్ని సోమవారం మండల వ్యాప్తంగా ఆ పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించుకున్నారు, మండల వ్యాప్తంగా ప్రతి గ్రామంలో పార్టీ గ్రామశాఖ ఆధ్వర్యంలో పార్టీ నాయకులు కార్యకర్తలు తమ యొక్క పార్టీ జెండాను ఆవిష్కరించి, కేకులు కట్ చేసి మిఠాయిలు పంపిణీ చేసుకుని ఆవిర్భావ దినోత్సవ వేడుక సంబరాల్ని నిర్వహించారు, ఈ సందర్భంగా మండల కేంద్రంలో బిఆర్ఎస్ మండల కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో భాగంగా మొదటగా తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు, అనంతరం గణపవరం ఫ్లైఓవర్ బ్రిడ్జి సెంటర్లో బిఆర్ఎస్ పార్టీ జెండాను మండల పార్టీ అధ్యక్షుడు తొగర రమేష్ ఆవిష్కరించి, కేక్ కట్ చేసి పార్టీ నాయకులు కార్యకర్తలకు మిఠాయిలు స్వీట్లు పంపిణీ చేసి ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు, ఈసందర్భంగా నిర్వహించిన సభలో పార్టీ సీనియర్ నాయకులు సుకరి అజయ్ కుమార్ మాట్లాడుతూ, 2001 లోకెసిఆర్ సారధ్యంలో తెలంగాణ రాష్ట్ర సాధన కోసం నాడు ఆవిర్భవించిన టిఆర్ఎస్ పార్టీ ,14 సంవత్సరాల పాటు ప్రత్యేక తెలంగాణరాష్ట్రసాధన కోసం చేసిన పోరాటం తెలంగాణ రాష్ట్రచరిత్రలోనిలిచిపోతుందన్నారు,శాంతియుత మార్గంలో పోరాటం నిర్వహించి,తెలంగాణ స్వరాష్ట్రాన్ని సాధించిన తర్వాత రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కేసీఆర్ సారధ్యంలో పదేళ్లపాటు రాష్ట్రప్రజలకు స్వచ్ఛమైన పాలన అందించిన ఘనత టిఆర్ఎస్ పార్టీ సొంతమన్నారు,తదనంతర పరిణామాలతో దేశవ్యాప్తంగా గులాబీ జెండా ఎగరవేయాలని తెలంగాణరాష్ట్రసమితి,టిఆర్ఎస్ పార్టీ కాస్త భారత రాష్ట్ర సమితి బిఆర్ఎస్ గా ఆవిర్భవించిందని ఆయన తెలిపారు, 2023లో జరిగిన ఎన్నికల్లో కేవలం ఒకటిన్నర శాతం ఓట్లతో అధికారానికి దూరమైనప్పటికీ, గత రెండున్నర సంవత్సరాల కాలంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పాలనపై ప్రతిపక్ష పార్టీగా ప్రజా సమస్యలపై అలుపెరగని పోరాటాలు నిర్వహిస్తు బిఆర్ఎస్ ముందుకు సాగుతుందని,ఆయన తెలిపారు, ఈకార్యక్రమంలో మాజీ పిఎసిఎస్ చైర్మన్లుకందిబండసత్యనారాయణ తొగరు సీతారాములు, రామ్ రెడ్డి, పార్టీ పట్టణఅధ్యక్షుడు ఉడుంకృష్ణ ఎల్ పి రామయ్య, వేట శివాజీ, కోళ్ల ఉపేందర్, గడ్డం లింగయ్య, జానీ,లక్ష్మయ్య, రామకృష్ణ, నవీన్ రెడ్డి, నాగబాబు,రచ్చ శ్రీను, గడ్డం విజయ్, సైదా, గంధం మహేష్, రాజేష్, రోడ్డు శ్రీను, తదితరులు పాల్గొన్నారు.
Admin
DNB News