DNB News - తెలంగాణ / : నడిగూడెం మండలం, సిరిపురం గ్రామంలో జై భీమ్ యువజన సంఘం అధ్యక్షులు కొత్తపల్లి వెంకటేశ్వర్లు, వ్యవస్థాపక అధ్యక్షులు కాంపాటి ధనుంజయ్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకులు, పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారు పాల్గొని అంబేద్కర్ గారి విగ్రహ ఆవిష్కరణను చేసిన అనంతరం మాట్లాడుతూ ఈ దేశంలో మొట్టమొదటిగా జ్యోతి బా పూలే, సావిత్రి బాయి పూలే ఇద్దరు బ్రిటీష్ పాలనలో చదువుకొని ఆ ఫలాలు బలహీన వర్గాలకు అందించిన మహనీయులు అని వారిని ఆదర్శంగా తీసుకొని దేశంలో, ప్రపంచంలో ఉన్న గొప్ప చదువులు చదివి స్వతంత్ర భారతదేశానికి రాజ్యాంగం రచించి రిజర్వేషన్ ఫలాలను అందించడం ద్వారానే విద్యా, ఉద్యోగ పరంగా, ఆర్థిక పరంగా సామాజికంగా దేశంలో దళితులు, గిరిజనులు ముందుకు పోయారని తెలియజేశారు దేశ స్వతంత్ర ఉద్యమంలో గాంధీ తో అంబేద్కర్ అతిపిన్న వయసులో పాల్గొన్న మహనీయుడు బాబు జగజీవన్ రామ్ అని అన్నారు ప్రతి దళిత ఉద్యోగస్తుడు ఒక నిరుపేద కుటుంబానికి చెందిన ఇద్దరు పిల్లలకు అయ్యే విద్య ఖర్చులంతా భరించాలని తెలిపారు వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలలు, వికలాంగుల పెన్షన్ల కోసం పోరాడి సాధించి మరియు గుండె జబ్బుల పిల్లల కోసం పోరాడి దేశంలో ఎక్కడలేని ఆరోగ్య శ్రీ పథకాన్ని సాధించిన ఘనత ఎమ్మార్పీఎస్ ఉద్యమానికి దక్కుతుందన్నారు ఆకలి కేకలు పోరాటాలు చేసి రేషన్ బియ్యం కోటాను పెంచడం జరిగినది భారత రాజ్యాంగ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు దళితులు క్రైస్తవ మతంలోకి పోతే రిజర్వేషన్ పొలాలు చెల్లదని చెప్పడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం గుడిలోకి బడిలోకి రానివ్వని బ్రాహ్మణిజాన్ని వ్యతిరేకిస్తున్నాము రాజ్యాంగం అందరికీ ఒకే విధంగా వర్తింపజేయాలని తెలియజేస్తూ మీకు ఇష్టం వచ్చినప్పుడు రావాలి మీకు ఇష్టం లేనప్పుడు రావద్దు అనడాన్ని తీవ్రంగా ఖండిస్తూ భవిష్యత్తులో సుప్రీంకోర్టు తీర్పు రద్దు అయ్యేంతవరకు ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో మా పోరాటాలని కొనసాగిస్తామని తెలియజేశారు అనంతరం డాక్టర్ నెమ్మాది ఉపేందర్ ఎం ఈ ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు మందకృష్ణ మాది గారి 33 సంవత్సరాల ఉద్యమ పోరాట పోరాటం ఎస్సీ వర్గీకరణ సాధించిన ఘట్టాన్ని తెలియజేస్తూ పాడిన పాట సిడి ఆవిష్కరణను అన్నగారి చేతుల మీదుగా చేయడం జరిగినది ఈ కార్యక్రమంలో నడిగూడెం తాహసిల్దార్ సోమపంగు సూరయ్య, నడిగూడెం ఎస్సై అజయ్ కుమార్, ఏపూరి రాజు మాదిగ ఎమ్మార్పీఎస్ సూర్యాపేట జిల్లా కన్వీనర్ , డాక్టర్ కత్తి వెంకటేశ్వర్లు మాదిగ ఎం.ఎఫ్ జాతీయ ప్రధాన కార్యదర్శి, గ్రామ సర్పంచ్ వెంపటి రామారావు, ఎమ్మెస్పీ రాష్ట్ర నాయకులు కొండపల్లి ఆంజనేయులు, ఉప సర్పంచ్ కొత్తపల్లి రమేష్, గ్రామ కార్యదర్శి సతీష్, అంగన్వాడి టీచర్ కొత్తపల్లి శైలజ, ఎమ్మార్పీఎస్ నడిగూడెం మండల అధ్యక్షులు మోలుగూరి సైదులు మాదిగ, పాతకోట్ల నాగరాజు, పాతకోట్ల ప్రకాష్ , ఎమ్మెస్ ఎఫ్ నాయకులు పందింటి నవీన్ , కొండపల్లి సూర్య ప్రకాష్, ఆకారపు కొండలు, మాతంగి కళ్యాణ్ , సిరిపురం గ్రామ జై భీమ్ యూత్ ఎమ్మార్పీఎస్ సభ్యులు కొత్తపల్లి లింగయ్య, విష్ణు, నాగరాజు, మహేష్, వెంకన్న, రమేష్, సురేందర్, సుధాకర్, ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు
Admin
DNB News