Tuesday, 28 April 2026 03:00:49 PM
# దేవోక్తి చారిటబుల్ ట్రస్ట్ అధినేతకు పితృ వియోగం.. # రాత్రి వేళల్లో కర్నూలులో కట్టుదిట్టమైన పోలీసింగ్ – ప్రజల భద్రతే లక్ష్యం.. # కర్నూలు జిల్లాలో పెట్రోల్, డీజిల్ కృత్రిమ కొరతపై ఆగ్రహం – తక్షణ చర్యలు తీసుకోవాలని సీపీఎం డిమాండ్... # పట్టుదలతో పతకాల వర్షం… అంతర్జాతీయ వేదికపై ఆదోని మహిళల ఘనత... # మండల వ్యాప్తంగాఘనంగా గులాబీ జెండా రెపరెపలుబీఆర్ఎస్ పార్టీఆవిర్భావ దినోత్సవ వేడుకలు # ఆదోని జిల్లా కోసం 163వ రోజు దీక్ష – హామీ కోసం జేఏసీ ఆగ్రహం.. # పొరంబోకు భూమిపై రాజకీయ గేమ్… హెచ్చరిక బోర్డు ధ్వంసం కలకలం.. # 121 ఫిర్యాదుల స్వీకరణ – చట్టపరంగా విచారణ చేసి బాధితులకు న్యాయం చేస్తాం కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ # పెట్రోల్, డీజిల్ కొరత లేదు – ఆందోళన వద్దు, అదనపు కొనుగోళ్లు చేయొద్దు: కలెక్టర్, ఎస్పీ హెచ్చరిక.. # ఆంధ్ర రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా పెట్రోల్, డీజిల్ కోసం సామాన్య ప్రజలు బారులు తీరడం # టిఆర్ఎస్ జండా ఆవిష్కరణ # హిందూధర్మం అంటే మతం కాదు, జీవన విధానం. .. # జై వడ్డె ఓబన్న జై వడ్డెర # వైసీపీకి భారి షాక్ – బీజేపీలోకి 30 కుటుంబాల ఘన చేరిక.. # కరీంనగర్ లో ఘనంగా కుబేర క్లాత్ షోరూం రెండో బ్రాంచ్ ప్రారంభం # భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ # నిజం చెప్పడం వల్ల అసౌకర్యం కలిగినా బాధ్యతతో వ్యవహరించాలి – సీనియర్ జర్నలిస్టు మగ్ధుం భాష... # హరీశ్ రావు ని శ్రీ పార్వతి సమేత రామలింగేశ్వర స్వామి దేవాలయ ప్రారంభోత్సవ కార్యక్రమానికి గ్రామస్థుల ఆహ్వానం # ఆదోని భూ మోసం బహిర్గతం – బాధితులకు న్యాయం కోసం పోరాటం.. గుడిసె కృష్ణమ్మ # కర్నూలు ఎస్పీని కలిసిన నూతన సివిల్ జడ్జి మహమ్మద్ అజామ్ – అభినందనలు తెలిపిన విక్రాంత్ పాటిల్..

పెట్రోల్, డీజిల్ కొరత లేదు – ఆందోళన వద్దు, అదనపు కొనుగోళ్లు చేయొద్దు: కలెక్టర్, ఎస్పీ హెచ్చరిక..

Date : 27 April 2026 05:58 PM Views : 18

DNB News - తెలంగాణ / : పెట్రోల్, డీజిల్ కొరత లేదని, వాహనదారులు ఆందోళన చెంది అవసరానికి మించి కొనుగోలు చేయవద్దని జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి, జిల్లా ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపిఎస్ స్పష్టం చేశారు. సోమవారం స్థానిక భూపాల్ కాంప్లెక్స్ ఎదురుగా ఉన్న నారాయణమూర్తి పెట్రోల్ బంక్, అమ్మ హాస్పిటల్ సమీపంలోని రిలయన్స్ పెట్రోల్ బంక్, గుత్తి పెట్రోల్ బంక్‌లను కలెక్టర్, ఎస్పీలు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో మొత్తం 166 పెట్రోల్ బంకులు ఉన్నాయని తెలిపారు. ప్రతి బంక్ వద్ద వీఆర్‌ఓలు పర్యవేక్షణ నిర్వహిస్తూ పెట్రోల్ లోడ్ వివరాలను నమోదు చేస్తున్నారని చెప్పారు. క్యాన్లు, డబ్బాలు, బ్యారెల్స్‌తో వచ్చి పెట్రోల్ తీసుకెళ్లకుండా షాపు యాజమాన్యాలకు ఆదేశాలు ఇచ్చినట్లు వెల్లడించారు. గత మూడు రోజులుగా జనసందోహం తగ్గుముఖం పట్టిందని, ఇప్పటివరకు 15 కేసులు నమోదు చేసి 150 లీటర్ల డీజిల్, 200 లీటర్ల పెట్రోల్ సీజ్ చేసినట్లు తెలిపారు. HPCL తదితర ఆయిల్ కంపెనీలతో చర్చించి సాయంత్రానికి 95–100 లోడ్లు అందుబాటులోకి వస్తాయని, దీంతో పరిస్థితి పూర్తిగా అదుపులోకి వస్తుందని చెప్పారు. అనంతరం వాహనదారులతో మాట్లాడిన కలెక్టర్, ఎటువంటి కొరత లేదని, అపోహలకు లోనవకుండా అవసరానికి సరిపడేంత మాత్రమే కొనుగోలు చేయాలని సూచించారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలు కూడా అధికారులకు సహకరించాలని కోరారు. జిల్లా ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ మాట్లాడుతూ పెట్రోల్ బంక్‌ల వద్ద క్యూలను నియంత్రించేందుకు ఇప్పటికే తగిన పోలీసు సిబ్బందిని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో డీఎస్ఓ రాజా రఘువీర్, సివిల్ సప్లైస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: