DNB News - తెలంగాణ / : మునగాల మండలం తిమ్మారెడ్డిగూడెం గ్రామస్థులు నేడు బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, మాజీ మంత్రివర్యులు శ్రీ హరీశ్ రావు ని కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ తో కలిసి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీ పార్వతి సమేత రామలింగేశ్వర స్వామి దేవాలయ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరుకావాలని హరీశ్ రావు ని వారు ఆహ్వానించడం జరిగింది .. గ్రామస్థుల ఆహ్హనం పట్ల సానుకూలంగా స్పందించిన హరీశ్ రావు ఆలయ ప్రారంభోత్సవ కార్యక్రమంలో తప్పకుండా పాల్గొంటానని తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మునగాల మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు తోగరు రమేశ్ , గ్రామ సర్పంచ్ రాములమ్మ కనకయ్య గారు, దేవాలయ కమిటీ చైర్మన్ మల్ రెడ్డి ప్రతాప్ రెడ్డి గ్రామ శాఖ అధ్యక్షుడు గోవింద రెడ్డి, నరేశ్, సీతారామ రెడ్డి, సత్తిరెడ్డి, షేక్ సైదా తదితరులు పాల్గొన్నారు.
Admin
DNB News