DNB News - తెలంగాణ / : మునగాల:మండలపరిధిలోని ముకుందాపురం గ్రామపరిధిలో ఉన్న ఇందిరా అనాధ వృద్ధాశ్రమంలో వృద్ధులకు అనాధలకు ఎన్.టి.ఎల్. సంస్థ ఆధ్వర్యంలో ఆశ్రమంలో కావాల్సినటువంటి నిత్యవసర సరుకులు వారం రోజులు సరిపడా కొనుగోలు చేసి సుమారు 19 వేల రూపాయల నిత్యవసర సరుకులను ఇందిరాఅనాధ వృద్ధాశ్రమంలో అందజేయడం జరిగింది, 25 కేజీల రైస్ బ్యాగులు మూడు, 20 కేజీల వెజిటేబుల్స్, వీటితోపాటు సరుకులు ఇప్పించడం జరిగింది, ఎన్.టి.ఎల్. సంస్థవారు మాట్లాడుతూ వృద్ధాశ్రమంలో వృద్ధులకు ఈ విధంగా అందజేయడం మా సంస్థ తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరు కూడా వృద్ధులకు అనాధలకు చేదోడు వాదోడుగా ప్రతి ఒక్కరు ముందుకొచ్చి సహాయ సహకారాలు అందించాలని ఈ సందర్భంగావారుఅన్నారు, ఆశ్రమనిర్వాహకురాలు నాగిరెడ్డి విజయమ్మ మాట్లాడుతూ, ఎన్ టి ఎల్ సంస్థ వారు ముందుకొచ్చి వారం రోజులకు సరిపడా నిత్యవసర సరుకులు అందజేసినందుకు వారికి వారి సంస్థకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నానని అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా ఆశ్రమానికి చేదోడు వాదోడుగా ముందుకొచ్చి సహాయ సహకారాలు అందించాలని,ఈసందర్భంగా ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో ఎన్.టి.ఎల్. సమస్త ప్రతినిధులు ఎం సురేష్, కోటేశ్వరరావు, విష్ణు, జ్యోతి, చందు,తదితరులు పాల్గొన్నారు.
Admin
DNB News