Saturday, 18 April 2026 07:27:31 PM
# ఫీజుల పేరుతో విద్యార్థుల అవమానం – ఆల్ఫా పాఠశాలపై క్రిమినల్ కేసు నమోదు చేయాలి: ఎస్ఎఫ్ఐ.. # మహిళా లోకానికి , దేశానికి ఏప్రిల్ 17 బ్లాక్ డే # టీనేజ్ ప్రెగ్నెన్సిలు , బాల్య వివాహాల నివారణపై కర్నూలులో కఠిన చర్యలు – SOP అమలుపై కలెక్టర్ సమీక్ష.. # మంగ్లీపై ఆరోపణల్ని ఖండిస్తున్నాం..అడ్వకేట్స్ అసోసియేషన్ నాయకులు భూక్యా హరినాయక్ # విజయవాడలో బిజెపి కీలక సమావేశం – రాబోయే కార్యక్రమాలపై దిశానిర్దేశం.. # పోచమ్మ చెరువులో పూడికతీత పనులకు భూమి పూజ – స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్రపై కలెక్టర్ డా.ఏ.సిరి అవగాహన # స్వర్ణాంధ్ర–స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా కర్నూలు జిల్లాలో పోలీసుల స్వచ్ఛత కార్యక్రమాలు... # శాతవాహనలో ప్రశాంతంగా డిగ్రీ పరీక్షలు # విశ్వహిందూ పరిషత్ బజరంగ్ దళ్ కరీంనగర్ # అల్ఫోర్స్ ఇ-టెక్నో స్కూల్ విద్యార్థులకు అంతర్జాతీయ మ్యాథ్స్ ఒలంపియాడ్ లో పతకాలు # రైతులు ధాన్యంలో తాలు లేకుండా కొనుగోలు కేంద్రానికి తీసుకుని రావాలి... జిల్లావ్యవసాయ అధికారి శ్రీధర్ రెడ్డి # బీసీవై పార్టీ ధర్మ దీక్షలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ పై అనుచిత వ్యాఖ్యలు # ఆరోగ్య సూత్రాలు పాటించండి శ్రమదానం చేయండి ఆరోగ్యంగా ఉండండి # ఓ పెళ్లి వేడుకలో కేటరింగ్ గుత్తేదారు దుశ్చర్యతో విషాద వాతావరణం అలముకొంది. # ఇల్లందు ప్రభుత్వ వైద్యశాల ను ఈరోజు కాయకల్ప ఎక్స్టర్నల్ అసెస్మెంట్ టీం డాక్టర్ రఘు పూజారి, డాక్టర్ జోత్స్న మరియు వారి బృందం సందర్శించారు # ఉపాధిహామీకూలీలకు రోజు 600 రూపాయల చెల్లించాలి వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు కామ్రేడ్ ములకలపల్లి రాములు డిమాండ్ # జీఎస్టీ అమలు సమన్వయంపై కలెక్టరేట్‌లో సమీక్ష సమావేశం # రాయలసీమ సాగునీటి హక్కుల కోసం వైఎస్ఆర్సీపీ సమాలోచన సమావేశం # కేంద్ర మంత్రి బండి సంజయ్ ని కలిసిన ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం # విద్యార్థుల ప్రాణాలతో ఆటలాడుతున్న స్కూల్ యాజమాన్యం – ఇంకా చర్యలు ఎందుకు లేవు?”..

మంగ్లీపై ఆరోపణల్ని ఖండిస్తున్నాం..అడ్వకేట్స్ అసోసియేషన్ నాయకులు భూక్యా హరినాయక్

Date : 18 April 2026 05:51 PM Views : 4

DNB News - తెలంగాణ / : బంజారా బిడ్డ, ప్రముఖ సింగర్ మంగ్లీపై కొంతమంది కావాలనే ఆరోపణలు చేస్తున్నారని, వాటిని ఖండిస్తున్నామని బంజారా అడ్వకేట్స్ అసోసియేషన్ నాయకులు, న్యాయవాది భూక్యా హరినాయక్ పేర్కొన్నారు. ఖమ్మంలోని ప్రెస్ క్లబ్‌లో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ మంగ్లీపై ఘోరాతిఘోరమైన ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. తప్పు జరిగిందని తెలిస్తే పోలీసులకు ఫిర్యాదు చేయాలి, సాక్ష్యాలను చూపాలి. కోర్టు శిక్షిస్తుంది. అలాగాకుండా వీుడియా సమావేశం పెట్టి చెప్పడం రాజ్యాంగ విరుద్ధమని అన్నారు. మంగ్లీ భవిష్యత్‌ను దెబ్బతీసేందుకు జరుగుతున్న కుట్రలో భాగమే ఇదంతా అని ఆరోపించారు. ప్రధాన నిందితుడిని విచారించి బాధితులకు న్యాయం చేయాలన్నారు. కంపెనీలో మంగ్లీ వాటా ఉందా, బోర్డు డైరెక్టర్‌గా ఉందా అనే విషయాలు తేలకుండా ఆమెపై ఎలా ఆరోపణలు చేస్తారని ప్రశ్నించారు. నిన్ను వదలనంటూ ఏకవచనంతో మాట్లాడడం సరికాదని, న్యాయవాద వృత్తికే సుబ్బారావు కళంకం తెస్తున్నాడని ఆరోపించారు. సాక్ష్యాలు ఉంటే పోలీసులకు అప్పగిస్తే వారే విచారణ జరుపుతారని అన్నారు. అలాగాకుండా బంజారా బిడ్డపై అవాస్తవమైన, అసత్యమైన ఆరోపణలు చేస్తే సహించేది లేదన్నారు. ధరావత్ వీరన్న మాట్లాడుతూ మంగ్లీ ప్రతిష్టను దిగజార్చేందుకు కొంతమంది కుట్ర చేస్తున్నారని అన్నారు. తానే బాధితుల తరుపున ఉంటానని మంగ్లీ చెప్పిందనే విషయం గుర్తు చేసుకోవాలన్నారు. న్యాయవాది బాణోత్ మణిమాల మాట్లాడుతూ మంగ్లీపై ఆరోపణలు బంజారా జాతికి ఘోరమైన అవమానమన్నారు. బెట్టింగ్ యాప్స్‌లో ఉన్న వారిపై చర్యలు తీసుకోవడం చేతకాదని, ట్యాక్స్‌లకు కట్టకుండా తప్పించుకు తీరుగుతున్న వారిని ఏం చేయలేకపోతున్నారని, దేశంలో నెంబర్‌వన్ సింగర్‌గా ఎదుగుతున్న బంజారా బిడ్డపై మాత్రం అవాస్తవమైన ఆరోపణలు చేస్తున్నారని వ్యాఖ్యానించారు. లంబాడీలపై ఎందుకు కక్ష్య కట్టారని ప్రశ్నించారు. వాస్తవాలు తెలుసుకోకుండా సోషల్ మీడియాలో ప్రచారం చేయవద్దని సూచించారు. మంగ్లీపై లేనిపోని అరోపణలు చేస్తే బంజారా జాతి చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు. ఈ సమావేశంలో న్యాయవాదులు తేజావత్ నర్సింహ, ధరావత్ ప్రసాద్, నునావత్ రవీందర్ తదితరులు పాల్గొన్నారు

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :