DNB News - తెలంగాణ / : శాతవాహన విశ్వవిద్యాలయంలో బిఏ, బీకాం, బీఎస్సీ కోర్సులలో రెండవ సెమిస్టర్ పరీక్షలు ప్రశాంతంగా నడుస్తున్నాయి. పరీక్షలు ఉదయం 9 గంటల నుండి 12 గంటలవరకు నడుస్తున్నాయి. విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య యు.ఉమేష్ కుమార్ ఆకస్మిక తనిఖీలో భాగంగా కరీంనగర్ పట్టణంలోని అల్పోర్స్ మహిళా డిగ్రీ కళాశాలను, వివేకానంద డిగ్రీ కళాశాల, అపూర్వ మహిళా డిగ్రీ కళాశాలను పరీక్షా నియంత్రణాధికారి డాక్టర్ టి సురేష్ కుమార్ తో కలిసి సందర్శించి పరీక్షలు నడుస్తున్న తీరును పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ పరీక్షలను పకడ్బందీగా, పారదర్శకంగా నిర్వహిస్తున్నామని పరీక్షలు ముగిసిన అనంతరం మూల్యాంకనం కూడా తొందరగా చేపట్టి ఫలితాలను సకాలంలో తీసుకొచ్చేందుకు అవసరమైన ప్రయత్నాలు చేస్తామని తెలియజేసారు.
Admin
DNB News