DNB News - తెలంగాణ / : ఈ నెల 15వ తేదీ రాత్రి జరిగిన పెళ్లికి చమన్ అలియాస్ అమర్ (11) తన అమ్మమ్మతో కలిసి హాజరయ్యాడు. ఈ బాలుడు పదే పదే లోనికి వచ్చి రసగుల్లాలు తింటున్నాడని కోపగించిన కేటరింగ్ గుత్తేదారు మొదట గట్టిగా అరిచాడు. మళ్లీ రావడంతో కోపం పట్టలేక బాలుణ్ని అమాంతం ఎత్తుకొని మండుతున్న తందూరీ పొయ్యిపై కూర్చోబెట్టాడు. ఈ ఘటనతో భయపడిపోయిన చమన్ పట్టుజారి పొయ్యిలోకి పడిపోయాడు. బాలుడి కేకలు విని పెళ్లిలో ఉన్న వారంతా పరుగున వచ్చి బయటకు తీశారు. ముఖం నుంచి నడుము భాగం దాకా తీవ్రంగా గాయపడిన చమన్ను లఖనవూ వైద్య కళాశాల ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు శుక్రవారం వివరించారు. బాలుడి కుటుంబికుల ఫిర్యాదుతో హత్యాయత్నం కేసు నమోదు చేశారు. చమన్ కోలుకొంటున్నాడని, పరారీలో ఉన్న గుత్తేదారు కోసం గాలిస్తున్నట్లు హరైయా సర్కిల్ అధికారి స్వర్ణిమా సింగ్ తెలిపారు.
Admin
DNB News