Saturday, 18 April 2026 07:28:36 PM
# ఫీజుల పేరుతో విద్యార్థుల అవమానం – ఆల్ఫా పాఠశాలపై క్రిమినల్ కేసు నమోదు చేయాలి: ఎస్ఎఫ్ఐ.. # మహిళా లోకానికి , దేశానికి ఏప్రిల్ 17 బ్లాక్ డే # టీనేజ్ ప్రెగ్నెన్సిలు , బాల్య వివాహాల నివారణపై కర్నూలులో కఠిన చర్యలు – SOP అమలుపై కలెక్టర్ సమీక్ష.. # మంగ్లీపై ఆరోపణల్ని ఖండిస్తున్నాం..అడ్వకేట్స్ అసోసియేషన్ నాయకులు భూక్యా హరినాయక్ # విజయవాడలో బిజెపి కీలక సమావేశం – రాబోయే కార్యక్రమాలపై దిశానిర్దేశం.. # పోచమ్మ చెరువులో పూడికతీత పనులకు భూమి పూజ – స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్రపై కలెక్టర్ డా.ఏ.సిరి అవగాహన # స్వర్ణాంధ్ర–స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా కర్నూలు జిల్లాలో పోలీసుల స్వచ్ఛత కార్యక్రమాలు... # శాతవాహనలో ప్రశాంతంగా డిగ్రీ పరీక్షలు # విశ్వహిందూ పరిషత్ బజరంగ్ దళ్ కరీంనగర్ # అల్ఫోర్స్ ఇ-టెక్నో స్కూల్ విద్యార్థులకు అంతర్జాతీయ మ్యాథ్స్ ఒలంపియాడ్ లో పతకాలు # రైతులు ధాన్యంలో తాలు లేకుండా కొనుగోలు కేంద్రానికి తీసుకుని రావాలి... జిల్లావ్యవసాయ అధికారి శ్రీధర్ రెడ్డి # బీసీవై పార్టీ ధర్మ దీక్షలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ పై అనుచిత వ్యాఖ్యలు # ఆరోగ్య సూత్రాలు పాటించండి శ్రమదానం చేయండి ఆరోగ్యంగా ఉండండి # ఓ పెళ్లి వేడుకలో కేటరింగ్ గుత్తేదారు దుశ్చర్యతో విషాద వాతావరణం అలముకొంది. # ఇల్లందు ప్రభుత్వ వైద్యశాల ను ఈరోజు కాయకల్ప ఎక్స్టర్నల్ అసెస్మెంట్ టీం డాక్టర్ రఘు పూజారి, డాక్టర్ జోత్స్న మరియు వారి బృందం సందర్శించారు # ఉపాధిహామీకూలీలకు రోజు 600 రూపాయల చెల్లించాలి వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు కామ్రేడ్ ములకలపల్లి రాములు డిమాండ్ # జీఎస్టీ అమలు సమన్వయంపై కలెక్టరేట్‌లో సమీక్ష సమావేశం # రాయలసీమ సాగునీటి హక్కుల కోసం వైఎస్ఆర్సీపీ సమాలోచన సమావేశం # కేంద్ర మంత్రి బండి సంజయ్ ని కలిసిన ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం # విద్యార్థుల ప్రాణాలతో ఆటలాడుతున్న స్కూల్ యాజమాన్యం – ఇంకా చర్యలు ఎందుకు లేవు?”..

అల్ఫోర్స్ ఇ-టెక్నో స్కూల్ విద్యార్థులకు అంతర్జాతీయ మ్యాథ్స్ ఒలంపియాడ్ లో పతకాలు

Date : 18 April 2026 04:55 PM Views : 3

DNB News - తెలంగాణ / : విద్యార్థులకు ప్రాథమిక దశ ఉండే గణిత శాస్త్రం పట్ల అవగాహన కల్పించాలని మరియు అందులో పట్టు సాధించేదందుకు ప్రోత్సాహాన్ని అందించాలని తద్వారా వారికి ఉపాధి అవకాశాలు చాలా ఉంటాయని అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత వి.నరేందర్ రెడ్డి స్థానిక కొత్తపల్లిలోని అల్ఫోర్స్ ఇ-టెక్నో పాఠశాలలో ఏర్పాటు చేసినటువంటి అభినందన సభకు ముఖ్యఅతిథిగా హాజరై వారు మాట్లాడారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులకు గణిత శాస్త్రం చాలా ముఖ్యమైనదని మరియు అన్ని పోటీ పరీక్షలలో చాలా కీలకంగా వ్యవహరిస్తుందని వారు చెప్పారు. గణిత శాస్త్రం యొక్క ప్రాముఖ్యతను దృష్టిలో పెట్టుకుని పాఠశాలలో నిపుణులైన ఉపాధ్యాయులు శిక్షణ ఇప్పిస్తున్నామని మరియు వివిధ స్థాయిలలో నిర్వహింపబడేటువంటి పోటీ పరీక్షలకు సైతం ఎంపిక చేస్తున్నామని వారు చెప్పారు. పోటీ పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించిన వారికి శిక్షణ ఇస్తూ ఉత్తమ స్థానాలలో స్థిరపడేటట్టు ప్రోత్సాహం అందిస్తున్నామని వారు చెప్పారు. ఈ క్రమంలో ఇటీవల కాలంలో యూనిఫైడ్ కౌన్సిల్ వారు నిర్వహించినటువంటి అంతర్జాతీయ మ్యాథమెటిక్స్ ఒలింపియాడ్లో పాఠశాలకు చెందినటువంటి జతిన్ సిద్ధార్థ, 4వతరగతి, డి.సిన్దశ్రీ,6వ తరగతి, క్రిషిక్ ప్రీన్స్, 7వ తరగతి, నడిపెల్లి సహార్ష్, 9వ తరగతి & శివ స్మరణ్ రెడ్డి, 9వ తరగతి ప్రశంసా పత్రాలను మరియు పతకాలు సాధించినట్లు వారు హర్షం వ్యక్తం చేశారు విజేతలుగా నిలిచినటువంటి విద్యార్థులకు పుష్పగుచాలతో అందజేసి భవిష్యత్తులో మరిన్ని అద్భుత విజయాలను నమోదు చేయాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :