DNB News - తెలంగాణ / : విద్యార్థులకు పటిష్టమైన ప్రణాళికలతో బోధించినట్లయితే సంచలనాత్మక ఫలితాలను సాధించవచ్చని అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత వి.నరేందర్ రెడ్డి స్థానిక వావిలాలపల్లిలోని అల్ఫోర్స్ టైనీ టాట్స్ ప్రాంగణంలో సీబీఎస్ఇ ఫలితాల్లో సంచలనాత్మక ఫలితాలు సాధించిన సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి పాత్రికేయుల సమావేశానికి మరియు విద్యార్థుల సన్మాన సభకు ముఖ్యఅతిథిగా హాజరై వారు మాట్లాడారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆల్ఫోన్స్ విద్యాసంస్థల్లో విద్యార్థులకు చాలా చక్కటి ప్రణాళికలతో మరియు అత్యుత్తమ బోధన సిబ్బందితో బోధన అందిస్తూ జాతీయస్థాయిలో ప్రతిష్టాత్మక పరీక్షల్లో ప్రశంసనీయమైన మార్కులను సాధింపచేస్తున్నామని హర్షం వ్యక్తం చేస్తూ ఈరోజు ప్రకటించినటువంటి సీబీఎస్ఈ పదో తరగతి ఫలితాల్లో అల్ఫోర్స్ హై స్కూల్ కి చెందినటువంటి విద్యార్థులు అత్యుత్తమ మార్కులను సాధించడం పట్ల హర్ష వ్యక్తం చేశారు 103 మంది విద్యార్థులు 500 మార్కూలకు గాను 450 మార్కులు సాధించి జిల్లా స్థాయిలో నూతన చరిత్రను సృష్టించారని హర్షం వ్యక్తం చేశారు సానీక-494, ఆదిత్య-492, ఎం.శ్రీహిత, ఏ.హర్ష & ఏ.శ్రీనిత 490 మార్కులు, కే.ఓం కార్తికేయ, కె.అస్మిత & కే.అభిజ్ఞ 488 మార్కులు, ఏ.స్వరవిస్తృతి 487 మార్కులు, ఎం.శ్రీగౌరీ 486 మార్కులు, కె.వర్దిని 485 మార్కులు, ఉదయశ్రీ & వి. అభిరామ్ - 484, కే.మోక్స్, జి. సాయి సుశేన్ & ఈ ప్రమేష్ రెడ్డి -483 మార్కులు సాధించారని మరియు విద్యార్థులు వివిధ సబ్జెక్టులలో నూరు శాతం మార్కులు సాధించారని సంతోషం వ్యక్తం చేశారు. మ ప్రారంభించిన నాటినుండి అల్ఫోర్స్ సీబీఎస్ఇ పై చేయి సాధిస్తుందని మరి గాయు ఘనవిజయాలను సాధించుటకై తోడ్పాటు అందిస్తున్న తల్లిదండ్రులకు మరియు అహర్నిశలు కృషి చేస్తున్నటువంటి సిబ్బందికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు జాతీయస్థాయిలో మెరిసినటువంటి విద్యార్థులందరికీ అభినందనలు తెలిపి పుష్పగుచ్చాలను అందజేసి రానున్న రోజుల్లో మరిన్ని అద్భుత విజయాలను నమోదు చేసి జిల్లా కీర్తిని ఇనుమడింప చేయాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్, సిబ్బంది, తల్లిదండ్రులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు
Admin
DNB News