Thursday, 16 April 2026 05:06:18 PM
# ఆకుపాముల గ్రామంలోని మాంటిస్సోరీ పాఠశాలలో "సురక్షితంగా ఇంటికి చేరుదాం ‘Arrive and Alive’" అవగాహన కార్యక్రమం # కొత్తగూడెం అరైవ్ అలైవ్ - రోడ్ సేఫ్టీ కార్యక్రమం # ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన భార్య # కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. 8 మంది మృతి, 12 మందికి గాయాలు # కుమార్తెను చంపి.. తాను ఆత్మహత్య చేసుకున్న తల్లి # రోడ్డుపై మొక్కజొన్నలు..! ద్విచక్రవాహనదారుడికి గాయాలు # ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలను కచ్చితంగా పాటించాలి : జారే ఆదినారాయణ # హుజూరాబాద్‌లో ఏసీబీ దాడి – అసిస్టెంట్ ఇంజనీర్ అరెస్ట్. # రోడ్డు ప్రమాద బాధితులను పరామర్శించిన కలెక్టర్ డా. ఏ. సిరి.. # ఘోర రోడ్డు ప్రమాద స్థలాన్ని పరిశీలించిన కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్. # నారీశక్తి తో నవభారతాన్ని నిర్మిస్తున్న మోదీ ప్రభుత్వం # సి. బి. యస్. ఈ. పదవ తరగతి పరీక్ష ఫలితాలలో పారమిత విద్యార్థుల ప్రభంజనం # అత్యుత్తమ మార్కులతో జాతియ స్థాయిలో మెరిసిన అల్ఫోర్స్ సీబీఎస్ఈ విద్యార్థులు # ఆంధ్రప్రదేశ్ లో నూతనంగా చీఫ్ సెక్రటరీగా నియమితులైన జి.సాయి ప్రసాద్ # తిరుపతి జిల్లా - ఎర్రచందనం స్మగ్లర్‌కు 5 సంవత్సరాల జైలు శిక్ష, రూ.3,00,000/- జరిమానా. # శాతవాహనలో రహదారి భద్రత అవగాహన సదస్సు # మానకొండూరు ఉప మండలం హిందూ సమ్మేళనం గోడ ప్రతి, కరపత్రాలు ఆవిష్కరణ # రాష్ట్రస్థాయి ఫస్ట్ మార్కులు కరీంనగర్ లోని కోట రెజోనెన్స్ విద్యార్థులకు రావడం గర్వకారణం # భారత ప్రభుత్వ హై లెవెల్ కమిటీలో పద్మశ్రీ మంద కృష్ణ మాదిగ # టీడీపీ జోనల్ కోఆర్డినేటర్‌గా బీటీ నాయుడు నియామకం..

శాతవాహనలో రహదారి భద్రత అవగాహన సదస్సు

Date : 16 April 2026 09:44 AM Views : 19

DNB News - తెలంగాణ / : శాతవాహన విశ్వవిద్యాలయంలో అంబేద్కర్ లైబ్రరీ ఆడిటోరియంలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో జరుగుతున్న రహదారి భద్రత వారోత్సవాలలో భాగంగా అవగాహన సదస్సును విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ ఆచార్య పి సతీష్ కుమార్ అధ్యక్షతన జరగగా అందరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, మానవ జీవితం చాలా ముఖ్యమైనదని దీని కొరకు రహదారి భద్రతా నియమాలు పాటించాలని తెలియజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఉపకులపతి ఉమేష్ కుమార్ మాట్లాడుతూ విద్యార్థులు ముఖ్యంగా యువత రాష్ డ్రైవింగ్ వీడి జాగ్రత్తగా వాహనాలు నడపాలని ఒక వ్యక్తిని కోల్పోతే కుటుంబం మొత్తం అనాధగా మారుతుందని విద్యార్థులు రహదారులపై బాధ్యతాయుతంగా ప్రయాణం చేసి సురక్షితంగా గమ్యాన్ని చేరాలని భద్రతా వారోత్సవాల సూచనలను అందరికీ తెలియజేయాలని ప్రచారం ద్వారానే ప్రమాదాలను అరికట్టవచ్చని తెలియజేశారు. విశిష్ట అతిథిగా విచ్చేసిన నగర పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం మాట్లాడుతూ యువత సురక్షితంగా రక్షణాత్మకంగా వాహనాలు నడపాలని 90 శాతం రోడ్డుపై జరిగే ప్రమాదాలలో మానవ తప్పిదాల వల్లనే జరుగుతున్నాయని సురక్షితమైన డ్రైవింగ్ కొరకు నిబంధనలను పాటించాలని ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని ట్రిపుల్ రైడింగ్ వీడాలని, తప్పనిసరిగా సీట్ బెల్ట్ లు ధరించాలని, మూల మడతల వద్ద జాగ్రత్తగా డ్రైవింగ్ చేయాలని, జీవితాన్ని బంగారుమయం చేసుకోవాలంటే యువత అనుక్షణం అప్రమత్తతో వాహనాలు నడపాలని ముఖ్యంగా స్పీడ్ నిబంధనలను పాటించాలని, నిర్లక్ష్యంతో ప్రాణాలు కోల్పోవద్దని , ప్రతి మూడు నిమిషాలకు ఒక ప్రమాదం జరుగుతుందని అందులో ఒకరు మృతులైతున్నారని, దానివలన వారి కుటుంబ సభ్యులు ఎంత వేదన చెందుతారో అర్థం చేసుకోవాలని విశ్వవిద్యాలయ విద్యార్థులు భద్రతా సూచనలను ప్రచారం ద్వారా అందరికీ తెలియజేయాలని సూచించారు. గౌరవ అతిథిగా విచ్చేసిన ట్రైనీ ఐపీఎస్ సోహన్ సునీల్ మాట్లాడుతూ సెల్ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయరాదని, తాగి వాహనాలు నడపరాదని సూచించారు. మరొక అతిది కొత్తపల్లి ఇన్స్పెక్టర్ కోటేశ్వర్ మాట్లాడుతూ సెల్ఫీల మోజులో కూడా ప్రమాదాలకు గురవుతున్నారని, రాంగ్ రూట్ లో వాహనాలు నడపారాదని తెలియజేశారు. ఈ భద్రత అవగాహన సదస్సులో భాగంగా కరపత్రాన్ని విడుదల చేయగా విశ్వవిద్యాలయ ఉపకులపతి ఎన్నారై నిధుల సహకారంతో విశ్వవిద్యాలయ విద్యార్థులకు సురక్షితంగా వాహనాలు నడపడానికి హెల్మెట్లను బహూకరించారు. ఈ కార్యక్రమంలో ఓఎస్డి టు వి సి డా. హరికాంత్ పరీక్షల నియంత్రణ అధికారి డా. సురేష్ కుమార్ ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపల్ డా. పద్మావతి, డా. అబ్రారుల్ బకి, చీఫ్ వార్డెన్ డా. మునవర్ మునావర్, ఆచార్య సుజాత, డా. జోసఫ్ డా. ప్రసాద్, డా. కిరణ్, డా. విజయప్రకాశ్, డా. మనోజ్, డా. నరేష్ వివిధ విభాగాల అధిపతులు కామర్స్,ఆర్ట్స్, న్యాయ, సైన్స్ కళాశాల అధ్యాపకులు, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :