DNB News - తెలంగాణ / : సి. బి. యస్. ఈ. పదవ తరగతి పరీక్ష ఫలితాలలో పారమిత విద్యార్థుల ప్రభంజనం సెంట్రల్ బోర్డు సి.బి.ఎస్.ఈ విడుదల చేసిన పదవ తరగతి సిబిఎస్సి వార్షిక ఫలితాల్లో స్థానిక నగరంలోని పారమిత హెరిటేజ్ పాఠశాల మరియు పారమిత వరల్డ్ స్కూల్ విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబర్చారు. ఇట్టి ఫలితాలలో ఆప్షనల్ సబ్జెక్టులు కాకుండా,మెయిన్ సబ్జెక్టులలో 500 మార్కులకు 492 మార్కులతో చెన్న శ్రీశాంత్ జిల్లా లో మొదటి స్థానం సాధించాడని పాఠశాల ప్రధానోపాధ్యాయులు పి.గోపికృష్ణ తెలిపారు.. ఈ ఫలితాల్లో మొత్తం 347 మంది విద్యార్థులు పరీక్షలు వ్రాయగా 100% ఉత్తీర్ణతో పారమిత విద్యార్థులు అద్భుత ఫలితాలు సాధిoచారని వీరిలో యం. శ్రీ వర్షిణి 487, కె. అగస్త్య 486, యం. పంజ్వాని 485, గంప సహస్ర 485, యం. రాహుల్ 485 , సి. హెచ్. వెంకట మోక్షిత్ 485, దియా బుల్డాక్ 483 , యం. సాయి అక్షర 481, యం. డి. అబ్దుల్ అరహాన్ లతీఫ్ 481, పి. రిధి 480 సాదించగా , సబ్జెక్టుల వారీగా 100 శాతం మార్కులు సాధించిన విద్యార్థులు గణితం లో 3, ఆంగ్లం లో 2, తెలుగు లో 17 , సామాన్య శాస్త్రం లో 1, సాంఘీక శాస్త్రంలో 99% మార్కులు 4 గురు విద్యార్థులు సాధించారు. పారమిత విద్యాసంస్థలలో నైపుణ్యాలకు పెద్దపీట వేసి ప్రస్తుత పోటీ ప్రపంచాన్ని తట్టుకునే విధంగా విద్యార్థులను అన్నిరంగాలలో తీర్చిదిద్దడం జరుగుతుంది. ఈ పద్దతిలో ఎక్కడా కూడా అధిక మార్కులు సాధించడానికి విద్యార్థులను బట్టి విధానానికి ప్రోత్సహించడం జరగదు. అత్యధిక విద్యార్థులు అత్యుత్తమ శాతాలతో ప్రతిభ కనబర్చిన విద్యార్థులను పారమిత పాఠశాలల అధినేత ఇ. ప్రసాద రావు ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్లు ప్రసూన,అనుకర్ రావు, వినోదరావు, రశ్మిత, రాకేష్, , వి.యు. ఎం. ప్రసాద్, హన్మంతరావు ప్రధానోపాధ్యాయులు పి. గోపికృష్ణ సమన్వయకర్తలు రవీంద్ర పాత్రో, నాగరాజు,రాము మరియు ఉపాధ్యాయలు పాల్గొన్నారు. పాఠశాలకు ఉత్తమ సహకారాన్నందిచిన తల్లిదండ్రులకు చైర్మన్ డా. ఇనుగంటి ప్రసాద రావు కృతజ్ఞతలు తెలియజేశారు
Admin
DNB News