Thursday, 16 April 2026 05:05:42 PM
# ఆకుపాముల గ్రామంలోని మాంటిస్సోరీ పాఠశాలలో "సురక్షితంగా ఇంటికి చేరుదాం ‘Arrive and Alive’" అవగాహన కార్యక్రమం # కొత్తగూడెం అరైవ్ అలైవ్ - రోడ్ సేఫ్టీ కార్యక్రమం # ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన భార్య # కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. 8 మంది మృతి, 12 మందికి గాయాలు # కుమార్తెను చంపి.. తాను ఆత్మహత్య చేసుకున్న తల్లి # రోడ్డుపై మొక్కజొన్నలు..! ద్విచక్రవాహనదారుడికి గాయాలు # ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలను కచ్చితంగా పాటించాలి : జారే ఆదినారాయణ # హుజూరాబాద్‌లో ఏసీబీ దాడి – అసిస్టెంట్ ఇంజనీర్ అరెస్ట్. # రోడ్డు ప్రమాద బాధితులను పరామర్శించిన కలెక్టర్ డా. ఏ. సిరి.. # ఘోర రోడ్డు ప్రమాద స్థలాన్ని పరిశీలించిన కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్. # నారీశక్తి తో నవభారతాన్ని నిర్మిస్తున్న మోదీ ప్రభుత్వం # సి. బి. యస్. ఈ. పదవ తరగతి పరీక్ష ఫలితాలలో పారమిత విద్యార్థుల ప్రభంజనం # అత్యుత్తమ మార్కులతో జాతియ స్థాయిలో మెరిసిన అల్ఫోర్స్ సీబీఎస్ఈ విద్యార్థులు # ఆంధ్రప్రదేశ్ లో నూతనంగా చీఫ్ సెక్రటరీగా నియమితులైన జి.సాయి ప్రసాద్ # తిరుపతి జిల్లా - ఎర్రచందనం స్మగ్లర్‌కు 5 సంవత్సరాల జైలు శిక్ష, రూ.3,00,000/- జరిమానా. # శాతవాహనలో రహదారి భద్రత అవగాహన సదస్సు # మానకొండూరు ఉప మండలం హిందూ సమ్మేళనం గోడ ప్రతి, కరపత్రాలు ఆవిష్కరణ # రాష్ట్రస్థాయి ఫస్ట్ మార్కులు కరీంనగర్ లోని కోట రెజోనెన్స్ విద్యార్థులకు రావడం గర్వకారణం # భారత ప్రభుత్వ హై లెవెల్ కమిటీలో పద్మశ్రీ మంద కృష్ణ మాదిగ # టీడీపీ జోనల్ కోఆర్డినేటర్‌గా బీటీ నాయుడు నియామకం..

ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలను కచ్చితంగా పాటించాలి : జారే ఆదినారాయణ

Date : 16 April 2026 11:24 AM Views : 21

DNB News - తెలంగాణ / : రోడ్డు భద్రతా నియమాలను పాటించడం ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతలా భావించాలి : ఎస్పీ రోహిత్ రాజు అశ్వారావుపేట పోలీసుల ఆధ్వర్యంలో Arrive-Alive కార్యక్రమంలో భాగంగా రోడ్డు ప్రమాదాల నివారణపై అవగాహనా కార్యక్రమం అశ్వారావుపేటలో రోడ్డు భద్రతపై ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు “అరైవ్ ఎలైవ్” కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.పట్టణంలోని శ్రీ శ్రీ ఫంక్షన్ హాల్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు,స్థానిక ఎమ్మెల్యే జారే ఆదినారాయణ,మున్సిపల్ పాలకమండలి సభ్యులు,అధికారులు,విద్యార్థులు,యువత పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే జారే ఆదినారాయణ మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాలు రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలను కచ్చితంగా పాటించడం అత్యవసరమని అన్నారు.మద్యం సేవించి వాహనాలు నడపడం ప్రాణాంతకమని హెచ్చరించారు.మైనర్లకు వాహనాలు ఇవ్వరాదని,హెల్మెట్ లేకుండా ద్విచక్ర వాహనాలు నడపకూడదని స్పష్టం చేశారు.కారులో ప్రయాణించే వారు తప్పనిసరిగా సీట్ బెల్ట్ ధరించాలని సూచించారు. అనంతరం ఎస్పీ రోహిత్ రాజు మాట్లాడుతూ, “అరైవ్ ఎలైవ్” కార్యక్రమ ముఖ్య ఉద్దేశం ప్రజల్లో రోడ్డు భద్రతపై చైతన్యం కల్పించడం అని తెలిపారు.ముఖ్యంగా యువతలో ట్రాఫిక్ నియమాల పట్ల అవగాహన పెంపొందించడం ద్వారా ప్రమాదాలను తగ్గించవచ్చని అన్నారు.చిన్న చిన్న నిర్లక్ష్యాలు కూడా పెద్ద ప్రమాదాలకు దారితీస్తాయని హెచ్చరిస్తూ,ప్రతి ఒక్కరూ బాధ్యతగా డ్రైవింగ్ చేయాలని సూచించారు.ఈ కార్యక్రమంలో భాగంగా కళాకారులచే రోడ్డు భద్రతపై అవగాహన కల్పించే సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.విద్యార్థుల్లో చైతన్యం పెంపొందించేందుకు పాఠశాల స్థాయిలో వక్తృత్వ పోటీలు నిర్వహించగా అందులో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ఎమ్మెల్యే జారే ఆదినారాయణ,ఎస్పీ రోహిత్ రాజు,మున్సిపల్ చైర్మన్ శశికళ చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. అనంతరం రోడ్లపై హెల్మెట్ లేకుండా ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్లు పంపిణీ చేసి,వాటి ప్రాముఖ్యతను వివరించారు.ఈ సందర్భంగా అధికారులు,ప్రజలు కలిసి రోడ్డు భద్రత నియమాలను పాటిస్తూ సురక్షిత ప్రయాణం చేయాలని ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ జూపల్లి శశికళ,వైస్ చైర్మన్ జూపల్లి రమేష్ బాబు,మున్సిపల్ కమిషనర్ నాగరాజు,అశ్వారావుపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ నాగరాజు రెడ్డి, ఎస్సై యాయాతి రాజు,అదనపు ఎస్ఐ అఖిల,ఎంపీడీవో అప్పారావు, మున్సిపాలిటీ పాలకవర్గ సభ్యులు,సర్పంచులు, ఉప సర్పంచులు,అంగన్వాడి కార్యకర్తలు, వివోఏ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :