DNB News - తెలంగాణ / : మునగాల: చెక్ బౌన్స్ కేసులో నిందితుడికి ఆరు నెలల జైలు శిక్ష విధిస్తూ కోదాడ కోర్టు బుధవారం తీర్పు వెల్లడించింది. కోర్టు వివరాల ప్రకారం 2016వ సంవత్సరంలో కోదాడ పట్టణానికి చెందిన కర్నాటి అశోక్ వద్ద నుంచి ఎలగందుల శ్రీనివాసరావు రూ. 11 లక్షలు అప్పుగా తీసుకున్నాడు. ఆ మొత్తానికి అశోక్కు చెక్ ఇచ్చాడు. అయితే, ఆ చెక్కును బ్యాంకులో వేయగా ఖాతాలో తగినంత సొమ్ము లేకపోవడంతో బౌన్స్ అయింది. దీనిపై బాధితుడు అశోక్ కోర్టును ఆశ్రయించారు.విచారణ అనంతరం నేరం రుజువు కావడంతో నిందితుడు శ్రీనివాసరావుకు ఆరు నెలల జైలు శిక్షతో పాటు, చెక్ మొత్తమైన రూ. 11 లక్షలను బాధితుడికి చెల్లించాలని కోర్టు తీర్పునిచ్చింది. ఈ మొత్తాన్ని నెల రోజుల్లోగా చెల్లించని పక్షంలో, అదనంగా మరొక నెల జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుందని న్యాయస్థానం స్పష్టం చేసింది. బాధితుడి తరఫున న్యాయవాది కంచర్ల శరత్ కుమార్, కోర్టులో వాదనలు వినిపించారు.
Admin
DNB News