DNB News - తెలంగాణ / : కరీంనగర్ టౌన్,ఏప్రిల్ 30 ( డి ఎన్ బి న్యూస్) బుధవారం విడుదలైన పదో తరగతి ఫలితాల్లో రేకుర్తిలోని పారడైజ్ పాఠశాల విద్యార్థులు రాష్ట్ర స్థాయి మార్కులతో అద్భుత విజయాన్ని సాధించినట్లు పాఠశాల చైర్మన్ డాక్టర్ పి. ఫాతిమా రెడ్డి తెలిపారు. టాప్ స్కోరర్లు పాఠశాలకు చెందిన వి. సాయిప్రేమ్ 591 మార్కులతో అగ్రస్థానంలో నిలవగా, షిఫా తమన్నా 586, వి. అశ్విని 584, బి. సాహితీ 584, బి. సుధీష్ణ 579, బి. లక్ష్మీ ప్రసన్న 578, ఎన్. స్ఫూర్తి రెడ్డి 574, బి. నక్షత్ర 574, సానియా 573, బి. జిషిత 570, మరియు ఎస్. శ్రీదేవి 570 మార్కులతో అత్యుత్తమ ప్రతిభ కనబరిచారు.విద్యార్థుల విజయాన్ని పురస్కరించుకుని బుధవారం పాఠశాల ఆవరణలో ప్రత్యేక అభినందన సభ నిర్వహించారు. ఈ సందర్భంగా విజేతలను డాక్టర్ ఫాతిమా రెడ్డి ప్రత్యేకంగా అభినందించారు. విద్యార్థుల కష్టం, ఉపాధ్యాయుల కృషి, తల్లిదండ్రుల సహకారం వల్లే ఈ ఫలితాలు సాధ్యమయ్యాయని ఆమె పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ టి. వసంత, వైస్ ప్రిన్సిపాల్ ఎ. మధు, ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొని సంబరాలు చేసుకున్నారు.
Admin
DNB News