DNB News - తెలంగాణ / : కరీంనగర్ జిల్లాలోని కొత్తపల్లి మండల కేంద్రంలో ఉన్న శ్రీ చైతన్య సీబీఎస్ఈ సీవో ఐపీఎల్ బ్రాంచ్ విద్యార్థులు ఐ ఎన్ టి ఎస్ ఓ(INTSO) ప్రతిభా పరీక్షలో ఉత్తమ ప్రతిభను కనబరిచారు. 2026 జనవరిలో జరిగిన ఐ ఎన్ టి ఎస్ ఓ లేవల్ -2 పరీక్షలో ఉత్తమ ప్రతిభను కనబరిచారు. ఐ ఎన్ టి ఎస్ ఓ ఫలితాలలో జాతీయ స్థాయిలో గూడ ప్రిన్స్ రెండవ స్థానంలో నిలిచారు వారికి గ్రాండ్ ప్రైస్ లాప్టాప్, గోల్డ్ మెడల్, మరియు మెరిట్ సర్టిఫికేట్ వచ్చింది. ఉత్తమ ప్రతిభను కనబరిచిన విద్యార్థికి గౌస్ అలాం కమిషనర్ ఆఫ్ పోలీస్ కరీంనగర్ బహుమతి ఇచ్చి అభినందించారు. అనంతరం గౌస్ అలాం కమిషనర్ ఆఫ్ పోలీస్ కరీంనగర్ మాట్లాడుతూ.... ఐ ఎన్ టి ఎస్ ఓ మంచి ఫలితాలను సాధించిన శ్రీ చైతన్య విద్యాసంస్థలకు అభినందనలు తెలియజేశారు. రాబోయే మరిన్ని పోటీ పరీక్షలలో జాతీయ రాష్ట్ర స్థాయిలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) లాగా పోటీ పడాలని తెలియజేశారు. ఇలాంటి ఫలితాలు తీసుకురావడం కోసం కృషిచేసిన ఉపాధ్యాయులను అభినందించారు. అనంతరం కరీంనగర్ పట్టణ ట్రాఫిక్ సిఐ సంజీవ్ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ మానసికంగా శారీగంగా అభివృద్ధి చెందు చదువులపై దృష్టి పెట్టి భవిష్యత్తులో జరగబోయే పోతే పరీక్షల్లో ఉత్తమ స్థానాలు సాధించాలని హృదయపూర్వకంగా తెలియజేశారు. అనంతరం ప్రతిభా పరీక్షలో గెలుచుకున్న బహుమతులను విద్యార్థులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ రాజకుమార్ ఆచార్య మాట్లాడుతూ జనవరి లో జరిగిన ఐ ఎన్ టి ఎస్ ఓ ఫలితాలలో సీబీఎస్ఈ సిఓ-ఐ పీఎల్ చింతకుంట బ్రాంచ్లో మూడవ తరగతి నుండి 9వ తరగతి వరకు వివిధ రకాల ఒలంపియాడ్ ఎగ్జామ్స్ ప్రతి సంవత్సరం శ్రీ చైతన్య మేనేజ్మెంట్ నిర్వహిస్తుంది. రాష్ట్రంలో దాదాపు 2500 మంది ప్రతిభ పరీక్షను రాశారు. అందులో శ్రీ చైతన్య సీబీఎస్ఈ సివో ఐపీఎల్ బ్రాంచ్ విద్యార్థి గూడ ప్రిన్స్ విద్యార్థికి రాష్ట్రంలో మొదటి స్థానం సాధించారు గ్రాండ్ ప్రైజ్ లాప్టాప్, గోల్డ్ మెడల్, మెరిట్ సర్టిఫికెట్ సాధించారు. ఈ బ్రాంచ్ 400 మంది విద్యార్థులలో 282 మంది విద్యార్థులకు గోల్డ్ మెడల్స్, మరియు మెరిట్ సర్టిఫికెట్స్ ను సాధించారు. ఇలాంటి ఒలంపియాడ్ పరీక్షలు ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్న సందర్భంలో ప్రతి ఏటా విద్యార్థుల ప్రతిభను కనబరుస్తున్నారు. ప్రతి ఒలంపియాడ్ పరీక్షలలో శ్రీ చైతన్య విద్యార్థులు విజయదుంబిని మోగిస్తున్నారు. ఇలాంటి ప్రతిభా పరీక్షలకు సిద్ధం చేస్తున్న ఉపాధ్యాయుని ఉపాధ్యాయులను అభినందించారు. జాతీయస్థాయిలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు మరియు వారి తల్లిదండ్రులను అభినందించారు. ఈ కార్యక్రమంలో శ్రీ చైతన్య విద్యాసంస్థల డైరెక్టర్ సీమా, జిఎం నాగేంద్ర, చైర్మన్ శ్రీధర్, డైరెక్టర్ శ్రీవిద్య అభినందనలు తెలియజేశారు. ఏజీఎం ఎం.రాజు ,అకాడమీ కోఆర్డినేటర్ ప్రవీణ్, ఏటీఎం ఆపరేషన్ సదాశివరెడ్డి, ఏవో హరికిషన్ రెడ్డి ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో ప్రైమరీ ప్రిన్సిపల్ నీలిమ వైస్ ప్రిన్సిపల్ బొంకూరి గోవర్ధన్ ఐపీఎల్ ఐసీ ఇంచార్జ్ శ్రీకాంత్ రెడ్డి, సి బ్యాచ్ ఇంచార్జ్ జయవర్ధన్ రెడ్డి, ప్రైమరీ ప్రీ ప్రైమరీ ఇన్చార్జులు, ఏవో కిషన్ రెడ్డి పిటిలు ప్రవీణ్, పవన్, సుజాత, భవాని,దేవిక మరియు ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు
Admin
DNB News