Monday, 15 June 2026 01:42:59 PM
# డయాబెటిస్ నియంత్రణకు ఆధునిక వైద్య విధానాలపై అవగాహన అవసరం: టీజీఆర్‌ఎస్‌ఎస్‌డీఐ ఆర్గనైజింగ్ సెక్రటరీ డా. జి. దీప # గంగా జయంతిని వైభవంగా నిర్వహించేందుకు గంగపుత్ర సంఘం తీర్మానం.. # హమాలీ కార్మికుల సంక్షేమానికి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి..సీఐటీయూ.. # ఉచిత సమ్మర్ కబడ్డీ కోచింగ్ క్యాంప్ విజయవంతం – క్రీడాకారులకు సర్టిఫికెట్ల ప్రదానం.. # INTUC ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు గా కుక్కల రామకృష్ణ (RK ) నియామకం # కూటమి ప్రభుత్వ వెన్నుపోటు పాలనపై వైఎస్సార్‌సీపీ మహాధర్నా.. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్.. # కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై ఆదోనిలో వైఎస్సార్‌సీపీ భారీ నిరసన ర్యాలీ ఎన్నికల హామీలు అమలు చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ # ఆలూరు లో కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై వైఎస్సార్సీపీ నిరసన.. # ఆదోనిలో బీజేపీకి భారీ చేరికలు – 200 కుటుంబాలకు ఎమ్మెల్యే డా. పార్థసారధి ఘన స్వాగతం.. # రహదారి ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు: ఎస్పీ విక్రాంత్ పాటిల్... # ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక"కలకోవ గ్రామసభకు హాజరైన డిప్యూటీ సీఈవో మహాలక్ష్మి* # ఎమ్మిగనూరులో నీటి సమస్యలకు చెక్ – అధికారులతో ఎమ్మెల్యే జయ నాగేశ్వర రెడ్డి సమీక్ష... # హమాలీ కార్మికుల హక్కుల కోసం ఉద్యమాలను ఉధృతం చేస్తాం: ఐఎఫ్టియు.. # ప్రభుత్వ పాఠశాల టాపర్లకు ఘన సన్మానం – విద్యార్థులే దేశ భవిష్యత్తు: గుడిసె కృష్ణమ్మ.. # ఫిట్ ఇండియా ‘సండేస్ ఆన్ సైకిల్’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన అడిషనల్ ఎస్పీలు.. # ప్రైవేటు పాఠశాలలో అధిక ఫీజులు వసూలు చేస్తున్న యజమానులపై చర్యలు తీసుకోవాలి # ఎన్‌రోల్‌మెంట్ డ్రైవ్ విజయవంతానికి కళాశాల సిబ్బంది సమావేశం # * ఆర్మీ ఉద్యోగాల ఎంపికలో వస్తున్న మార్పులకు అనుగుణంగా శిక్షణ. # ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర శిక్షణా తరగతులను జయప్రదం చేయాలి – షాబీర్ భాష.. # పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి: జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి..

శ్రీ చైతన్య ఐఎన్టిఎస్ఒ(INTSO) ఫలితాలలో కరీంనగర్ శ్రీ చైతన్య సీబీఎస్ఈ సి ఐపీఎల్ బ్రాంచ్ విద్యార్థుల హవా...

Date : 28 March 2026 10:54 AM Views : 51

DNB News - తెలంగాణ / : కరీంనగర్ జిల్లాలోని కొత్తపల్లి మండల కేంద్రంలో ఉన్న శ్రీ చైతన్య సీబీఎస్ఈ సీవో ఐపీఎల్ బ్రాంచ్ విద్యార్థులు ఐ ఎన్ టి ఎస్ ఓ(INTSO) ప్రతిభా పరీక్షలో ఉత్తమ ప్రతిభను కనబరిచారు. 2026 జనవరిలో జరిగిన ఐ ఎన్ టి ఎస్ ఓ లేవల్ -2 పరీక్షలో ఉత్తమ ప్రతిభను కనబరిచారు. ఐ ఎన్ టి ఎస్ ఓ ఫలితాలలో జాతీయ స్థాయిలో గూడ ప్రిన్స్ రెండవ స్థానంలో నిలిచారు వారికి గ్రాండ్ ప్రైస్ లాప్టాప్, గోల్డ్ మెడల్, మరియు మెరిట్ సర్టిఫికేట్ వచ్చింది. ఉత్తమ ప్రతిభను కనబరిచిన విద్యార్థికి గౌస్ అలాం కమిషనర్ ఆఫ్ పోలీస్ కరీంనగర్ బహుమతి ఇచ్చి అభినందించారు. అనంతరం గౌస్ అలాం కమిషనర్ ఆఫ్ పోలీస్ కరీంనగర్ మాట్లాడుతూ.... ఐ ఎన్ టి ఎస్ ఓ మంచి ఫలితాలను సాధించిన శ్రీ చైతన్య విద్యాసంస్థలకు అభినందనలు తెలియజేశారు. రాబోయే మరిన్ని పోటీ పరీక్షలలో జాతీయ రాష్ట్ర స్థాయిలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) లాగా పోటీ పడాలని తెలియజేశారు. ఇలాంటి ఫలితాలు తీసుకురావడం కోసం కృషిచేసిన ఉపాధ్యాయులను అభినందించారు. అనంతరం కరీంనగర్ పట్టణ ట్రాఫిక్ సిఐ సంజీవ్ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ మానసికంగా శారీగంగా అభివృద్ధి చెందు చదువులపై దృష్టి పెట్టి భవిష్యత్తులో జరగబోయే పోతే పరీక్షల్లో ఉత్తమ స్థానాలు సాధించాలని హృదయపూర్వకంగా తెలియజేశారు. అనంతరం ప్రతిభా పరీక్షలో గెలుచుకున్న బహుమతులను విద్యార్థులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ రాజకుమార్ ఆచార్య మాట్లాడుతూ జనవరి లో జరిగిన ఐ ఎన్ టి ఎస్ ఓ ఫలితాలలో సీబీఎస్ఈ సిఓ-ఐ పీఎల్ చింతకుంట బ్రాంచ్లో మూడవ తరగతి నుండి 9వ తరగతి వరకు వివిధ రకాల ఒలంపియాడ్ ఎగ్జామ్స్ ప్రతి సంవత్సరం శ్రీ చైతన్య మేనేజ్మెంట్ నిర్వహిస్తుంది. రాష్ట్రంలో దాదాపు 2500 మంది ప్రతిభ పరీక్షను రాశారు. అందులో శ్రీ చైతన్య సీబీఎస్ఈ సివో ఐపీఎల్ బ్రాంచ్ విద్యార్థి గూడ ప్రిన్స్ విద్యార్థికి రాష్ట్రంలో మొదటి స్థానం సాధించారు గ్రాండ్ ప్రైజ్ లాప్టాప్, గోల్డ్ మెడల్, మెరిట్ సర్టిఫికెట్ సాధించారు. ఈ బ్రాంచ్ 400 మంది విద్యార్థులలో 282 మంది విద్యార్థులకు గోల్డ్ మెడల్స్, మరియు మెరిట్ సర్టిఫికెట్స్ ను సాధించారు. ఇలాంటి ఒలంపియాడ్ పరీక్షలు ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్న సందర్భంలో ప్రతి ఏటా విద్యార్థుల ప్రతిభను కనబరుస్తున్నారు. ప్రతి ఒలంపియాడ్ పరీక్షలలో శ్రీ చైతన్య విద్యార్థులు విజయదుంబిని మోగిస్తున్నారు. ఇలాంటి ప్రతిభా పరీక్షలకు సిద్ధం చేస్తున్న ఉపాధ్యాయుని ఉపాధ్యాయులను అభినందించారు. జాతీయస్థాయిలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు మరియు వారి తల్లిదండ్రులను అభినందించారు. ఈ కార్యక్రమంలో శ్రీ చైతన్య విద్యాసంస్థల డైరెక్టర్ సీమా, జిఎం నాగేంద్ర, చైర్మన్ శ్రీధర్, డైరెక్టర్ శ్రీవిద్య అభినందనలు తెలియజేశారు. ఏజీఎం ఎం.రాజు ,అకాడమీ కోఆర్డినేటర్ ప్రవీణ్, ఏటీఎం ఆపరేషన్ సదాశివరెడ్డి, ఏవో హరికిషన్ రెడ్డి ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో ప్రైమరీ ప్రిన్సిపల్ నీలిమ వైస్ ప్రిన్సిపల్ బొంకూరి గోవర్ధన్ ఐపీఎల్ ఐసీ ఇంచార్జ్ శ్రీకాంత్ రెడ్డి, సి బ్యాచ్ ఇంచార్జ్ జయవర్ధన్ రెడ్డి, ప్రైమరీ ప్రీ ప్రైమరీ ఇన్చార్జులు, ఏవో కిషన్ రెడ్డి పిటిలు ప్రవీణ్, పవన్, సుజాత, భవాని,దేవిక మరియు ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :