DNB News - తెలంగాణ / : బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్రను మున్నూరుకాపు ప్రముఖులు శాలువాతో సత్కరించారు.యాదాద్రి (యాదగిరిగుట్ట)లో నెలకొన్న మున్నూరుకాపు నిత్యాన్నదాన సత్రం ఛైర్మన్ నేతి విద్యాసాగర్ ఆధ్వర్యాన ఈనెల 19వతేదీన శ్రీలక్ష్మీ నరసింహాస్వామి కళ్యాణోత్సవం ఘనంగా జరిగింది.ఈ సందర్భంగా సత్రం ట్రస్ట్ బోర్డు సభ్యుడు పలుగుల శ్రీనివాస్,సంఘం ప్రముఖులు సిలిగిరి విక్రమ్,సీ.ఏ.లక్మణ్ తదితరులు ఎంపీ రవిచంద్రను శాలువాతో సత్కరించి,జ్ఞాపికను ప్రదానం చేశారు, స్వామి వారి ప్రసాదం అందజేశారు.ఈ కార్యక్రమంలో సంఘం రాష్ట్ర అధ్యక్షులు సర్థార్ పుటం పురుషోత్తమ రావు, ప్రముఖులు రౌతు కనకయ్య,రమేష్ హజారీ,మరికల్ పోత సుధీర్ కుమార్,ఆవుల రామారావు,ఊసా రఘు తదితరులు పాల్గొన్నారు.
Admin
DNB News