DNB News - తెలంగాణ / : ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు ఇప్పుడు గాలిలో కలిసిపోయాయా అంటూ ఆశా వర్కర్లు ప్రభుత్వంపై మండిపడ్డారు. మండల పరిధిలోని రేపాలం గ్రామంలో. పలువురు మాట్లాడుతూ. సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన రూ.18,000 ఫిక్స్ వేతనం ఎక్కడ? ఎప్పుడు? అని సూటిగా ప్రశ్నించారు. “ఓటు కోసం ఇచ్చిన మాట అధికారంలోకి వచ్చాక మరచిపోవడం ఎందుకు?” అంటూ ఆశలు ఆగ్రహావేశంతో విరుచుకుపడ్డారు. ఆదేశాలు జారీ చేశామంటూ చెప్పడం కాకుండా, వెంటనే వేతనాలు ఖాతాల్లో పడాలని గట్టిగా డిమాండ్ చేశారు. ఉద్యోగ భద్రత లేకుండా, కనీస గౌరవం లేకుండా పనిచేస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. హెల్త్ ఇన్సూరెన్స్, ప్రసూతి సెలవులు వంటి హక్కులు ఇవ్వకపోతే ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. “మా సహనం పరీక్షించొద్దు… మా పోరాటం ఆగదు!” అంటూ ప్రభుత్వానికి చివరి హెచ్చరిక జారీ చేశారు. ఈ సందర్భంగా ఆశా వర్కర్స్ యూనియన్ నాయకురాలు జి. భాగ్యలక్ష్మి ఆధ్వర్యంలో జరిగిన నిరసన ఆగ్రహ జ్వాలలతో నిండిపోయింది. భారీ సంఖ్యలో ఆశా వర్కర్లు పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఎం. సుధారాణి, మయూరి, అరుణ, జ్యోతి, ఆశ వర్కర్లు పాల్గొన్నారు.
Admin
DNB News