Tuesday, 14 April 2026 07:31:58 AM
# ప్రైవేట్ కార్పొరేట్ విద్యాసంస్థల దోపిడిపై చర్యలు తీసుకోవాలి – ఏఐఎస్ఎఫ్ డిమాండ్. # ప్రతి ఒక్కరు విధిగా రహదారి నిబంధనలు పాటించాలి. సర్పంచ్ వేమూరి సత్యనారాయణ. # రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ – నేరాలకు దూరంగా ఉండాలని హెచ్చరిక... # ఆదోనిలో అత్యాధునిక కామత్ డెంటల్ వైద్యశాల ప్రారంభం – ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారధి.. # హైందవ ధర్మ ప్రచారం కోసం కృషి చేయాలి – ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారధి. # చిత్తూరు జిల్లా మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు # అనంతపురం జిల్లా గ్రంథాలయంలో పూలే జయంతి వేడుకలు # అన్నమయ్యా జిల్లా మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి సంబరాలు # ఆదోని జిల్లా సాధన 150వ రోజు దీక్ష సభను ఘనంగా నిర్వహిద్దాం – జేఏసీ పిలుపు... # స్వచ్ఛతకు తొలి ప్రాధాన్యత – ఇంటింటి చెత్త సేకరణకు 20 వాహనాల ప్రారంభం... # కర్నూలు జిల్లాలో మెగా కార్డన్ సెర్చ్ ఆపరేషన్ # ఆకుపాముల గ్రామ నివాసి లిక్కి కృష్ణంరాజు వారి కుమారుడు లిక్కి వర్షిత్ సాహస యాత్ర విజయవంతం # సమానత్వ జ్యోతి వెలిగించిన మహానేత జ్యోతిరావు పూలే జయంతి ఘనంగా # అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో ఘనంగా మహాత్మ జ్యోతిరావు పూలే 199వ జయంతి వేడుకలు # ఆస్పరి దాహార్తి ఎప్పుడు తీరుతుంది? # మహాత్మా జ్యోతిరావు పూలే ఆశయాలను సాధిస్తాం -- ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి... # మహాత్మ జ్యోతిరావు పూలె కు ఘన నివాళులు # వాట్సాప్ ద్వారా ఇంటర్మీడియట్ ఫలితాలు అందుబాటులోకి # రోడ్డు ప్రమాదాలను అరికట్టడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి # రేషన్ బియ్యం అక్రమ రవాణాపై కఠిన చర్యలు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకలు

Date : 19 February 2026 03:43 PM Views : 61

DNB News - తెలంగాణ / : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి పి. వసంత్ మాట్లాడుతూ ఛత్రపతి శివాజీ మహారాజ్ భారత చరిత్రలో అపూర్వమైన యోధుడు, ధైర్యవంతుడైన వీరుడు, ప్రజాహిత పరిపాలనకు ప్రతీకగా నిలిచిన మహానుభావుడని తెలిపారు. స్వరాజ్య స్థాపన కోసం ఆయన చేసిన త్యాగాలు, దేశభక్తి, నాయకత్వ లక్షణాలు నేటి తరాలకు ఆదర్శంగా నిలుస్తాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు లక్కినేని సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శి భాగం మాధవరావు, కార్యవర్గ సభ్యులు కాసాని రమేష్, కె. చిన్నికృష్ణ, అడపాల పార్వతి తదితరులు పాల్గొన్నారు. అలాగే సీనియర్ మరియు యువ న్యాయవాదులు భారీ సంఖ్యలో హాజరై శివాజీ మహారాజ్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఆయన సేవలను స్మరించుకున్నారు. సమావేశంలో ప్రసంగించిన వక్తలు ఛత్రపతి శివాజీ మహారాజ్ జీవిత స్ఫూర్తి, ధైర్యం, న్యాయపరమైన పరిపాలన లక్షణాలు సమాజానికి మార్గదర్శకంగా నిలుస్తాయని అభిప్రాయపడ్డారు.

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :